Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన మెలోని
- మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు
- మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో ప్రధాని మోడీ-జార్జియా మెలోనికి సంబంధించిన ‘మెలోడీ’ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. గంటల వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మెలోని వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇటలీ తొలి మహిళా ప్రధాని మెలోని పెళ్లి చేసుకున్నారా? లేదంటే సింగిల్గా ఉన్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జార్జియా మెలోని ఇప్పటివరకు అధికారికంగా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె సింగిల్గా ఉన్నారు. ఇటలీ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునోతో ఆమె చాలా కాలం రిలేషన్లో(సహజీవనం) ఉన్నప్పటికీ.. 2023లో ఇద్దరూ విడిపోయారు. 2014లో మీడియా, రాజకీయ వర్గాల ద్వారా మెలోని-జియాంబ్రునో పరిచయం ఏర్పడినట్లు సమాచారం.
Also Read
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం

జియాంబ్రునో ఇటలీకి చెందిన మెడియాసెట్ టీవీ ఛానళ్లలో జర్నలిస్టుగా, ప్రెజెంటర్గా పనిచేశారు. మెలోని రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో వీరిద్దరి సంబంధం చాలా కాలం కొనసాగింది. ఈ క్రమంలోనే 2016లో వీరికి గినెవ్రా అనే కుమార్తె జన్మించింది. కుటుంబ విలువలు, మాతృత్వం, క్రమశిక్షణ వంటి అంశాలను మెలోని ఎప్పుడూ తన రాజకీయ గుర్తింపులో భాగంగా చూపించేవారు.

2022లో ఆమె పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ అధికారంలోకి వచ్చిన తర్వాత జియాంబ్రునో తరచూ మెలోనితో పబ్లిక్ ఈవెంట్లలో కనిపించేవారు. అయితే 2023 అక్టోబర్లో వీరి సంబంధం ఒక్కసారిగా వివాదాల్లోకి వెళ్లింది. జియాంబ్రునోకు సంబంధించిన కొన్ని బ్యాక్స్టేజ్ వీడియోలు ఇటలీ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో మహిళా సహచరులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బయటపడటంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆ తర్వాత మెలోని సోషల్ మీడియాలో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘మా మార్గాలు కొంతకాలంగా వేర్వేరుగా మారాయి’’ అని పేర్కొంటూ.. తన ప్రధాన బాధ్యత తమ కుమార్తెను రక్షించడమేనని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని కూడా మెలోని గుర్తుచేసుకున్నారు.

విడిపోయిన తర్వాత మెలోని కొత్త రిలేషన్లో ఉన్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఆమె సింగిల్ మదర్గా.. అదే సమయంలో యూరప్లో అత్యంత ప్రభావశీల ప్రభుత్వ నాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటలీ ప్రధానిగా.. ఓ కుమార్తెకు తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ముందుకు సాగిపోతున్నారు.
ఇదిలా ఉంటే ‘మెలోడీ’ మీమ్స్తో మెలోని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫేవరెట్గా మారిపోయారు. యూరప్ రాజకీయాలను దాటి ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది.
La mia relazione con Andrea Giambruno, durata quasi dieci anni, finisce qui. Lo ringrazio per gli anni splendidi che abbiamo trascorso insieme, per le difficoltà che abbiamo attraversato, e per avermi regalato la cosa più importante della mia vita, che è nostra figlia Ginevra.… pic.twitter.com/1IpvfN8MgA
— Giorgia Meloni (@GiorgiaMeloni) October 20, 2023
తాజావార్తలు
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!