Earth: భూ ఉపరితలం కింద 700 కి.మీ. దిగువన భారీ సముద్రం.. సైంటిఫిక్ డిస్కవరీ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth: విశ్వంలో ప్రతీది ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది. మనం ఎంత తెలుసుకున్నా అది కేవలం సముద్రంలో నీటి చుక్క మాత్రమే. ఇప్పటికీ మనం నివసిస్తున్న భూగ్రహం గురించిన వివరాలను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాం. కానీ కొత్త కొత్త ఆవిష్కరణలు మాత్రం మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. తాజాగా ఓ శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. భూమి క్రస్ట్ కింద భారీ సముద్రం దాగి ఉన్నట్లు తెలుస్తోంది.
భూమి ఉపరితలం కింద 700 కి.మీ దిగువన ‘‘రింగ్వుడైట్’’ అని పిలువబడే రాతి నిర్మాణంలో నీరు భారీగా నిల్వచేయబడుతోంది. ఈ భూగర్భ జలాశయం, భూమిపై ఉన్న సముద్రాల పరిమాణంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. ఈ ఫలితాలు 2014లో ‘డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది లోయర్ మాంటిల్’ అనే శాస్త్రీయ పత్రంలో వివరంగా అందించబడ్డాయి. ఇది రింగ్వుడైట్ యొక్క ప్రత్యేక లక్షణాలను కూడా అందించింది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Read Also: Rahul gandhi: వయనాడ్లో రాహుల్ నామినేషన్.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు
‘‘రింగ్వుడైట్’’ ఒక స్పాంజి లాంటిది. నీటిని పీల్చుకోవడం, హైడ్రోజన్ని ఆకర్షించడానికి, నీటిని ట్రాప్ చేయడానికి అనుమతించేలా రింగ్వుడైట్ క్రిస్టల్ నిర్మాణం ఉంటుందని డిస్కవరీ టీమ్లోని కీలక సభ్యుడు జియోఫిజిసిస్ట్ స్టీవ్ జాకబ్సెన్ చెప్పారు. ‘‘భూమి నీటి చక్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలను మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. భూ ఉపరితలంపై నీరు ఎలా వచ్చిందనే దానిని ఇది వివరించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా గుర్తించలేని లోతైన నీటి కోసం వెతుకుతున్నారు’’ అని ఆయన చెప్పారు.
భూకంపాలను అధ్యయనం చేసిన తర్వాత, భూ ఉపరితలం కింద ఉన్న షాక్వేవ్లను సిస్మోమీటర్ గుర్తించిన తర్వాత పరిశోధకులు ఈ ఆవిష్కరణ చేశారు. “భూమి యొక్క మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ (410- నుండి 660-కిలోమీటర్ల లోతు)లోని ఖనిజాల యొక్క అధిక నీటి నిల్వ సామర్థ్యం లోతైన H2O రిజర్వాయర్ యొక్క అవకాశాన్ని సూచిస్తుంది. ఇది నిలువుగా ప్రవహించే మాంటిల్ నిర్జలీకరణకు కారణమవుతుంది.’’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ట్రాన్సిషన్ జోన్లో వారు ఇంటర్గ్రాన్యులర్ మెల్ట్ని కనుగొన్నారు. ఈ పెద్ద ట్రాన్సిషన్ జోన్, డీహైడ్రేషన్ మెల్టింగ్ నీటిని ట్రాప్ చేయడానికి పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!