Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 30,000 దాటిన మృతుల సంఖ్య…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేయడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాతో పాటు పాలస్తీనా భూభాగాలపై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని హమాస్ స్థావరాలు, మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని లెక్కచేయడం లేదు.
ఇదిలా ఉంటే, హమాస్ దాడులకు సామాన్య పాలస్తీనా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటి వరకు యుద్ధంలో 30,000 మంది మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మరోవైపు గాజా ప్రాంతంలో తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది. ప్రజలకు మందులు, తినడానికి తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మొక్కలు, పశుగ్రాసంతో చేసే వంటకాలను తిని ఆకలి తీర్చుకోవాల్సి వస్తోంది. ఉత్తర గాజా ప్రాంతం నుంచి లక్షల్లో జనభా ఈజిప్టు సరిహద్దులోని రఫాకు చేరుకుంటున్నారు.
Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
Read Also: Leopard Population: దేశంలో పెరిగిన చిరుతపులుల జనాభా.. ఈ రాష్ట్రాల్లోనే అధికం..
ఇజ్రాయిల్-హమాస్ మధ్య మరోసారి సంధి ఒప్పందాన్ని తెచ్చేందుకు ఈజిప్టు, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. మార్చి 10, 11 నుంచి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సంధి ఉండే అవకాశం ఉందని మధ్యవర్తులు చెబుతున్నారు. గతంలో జరిగిన ఒప్పందం లాగే ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉంచిన పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని, అందుకు ప్రతిగా తాము బందీలుగా ఉన్న ఇజ్రాయిలీలను విడుదల చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయిల్ ప్రకారం దాదాపుగా 250 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారు, అంతకుముందు సంధి ఒప్పందంలో పలువురిని విడుదల చేయగా.. ప్రస్తుతం 130 మంది హమాస్ వద్ద ఉన్నారని, వీరిలో 31 మంది మరణించినట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!