Turkey Earthquake: మూడు రోజుల ముందే భూకంపాన్ని పసిగట్టాడు.. కానీ!
Frank Hoogerbeets Predicts Turkey Syria Earthquakes 3 Days Before: టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసిన భారీ భూకంపాలను ఒక వ్యక్తి ముందుగానే పసిగట్టాడు. భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (SSGEOS)కు చెందిన ఫ్రాంక్ హూగర్బీట్స్ అనే పరిశోధకుడు.. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో త్వరలోనే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని ఫిబ్రవరి 3వ తేదీన ట్వీట్ చేశాడు. అయితే.. అప్పుడు అతడ్ని ఎవ్వరూ నమ్మలేదు. అతనో నకిలీ శాస్త్రివేత్త అంటూ నెటిజన్లు ధ్వజమెత్తారు. ఎందుకంటే.. గతంలో ఆయన వేసిన అంచనాలన్నీ బోల్తాపడ్డాయి. అందుకే.. ఇలాంటి తప్పుడు ట్వీట్లు వేయొద్దంటూ అతడ్ని మొదట్లో విమర్శించారు.
Vizag Capital: చకచకా విశాఖకు జగన్.. మార్చినుంచి అక్కడే మకాం
Also Read
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
కానీ.. ఫ్రాంక్ చెప్పినట్టుగానే మూడు రోజుల తర్వాత టర్కీ, సిరియాలను భూకంపాలు కుదిపేశాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు ఆ రెండు ప్రాంతాల్ని చిదిమేశాయి. రెండు దేశాల్లో కలిపి 2800కు పైగా బిల్డింగులు నేలమట్టమయ్యాయి. 3400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాదిమంది తీవ్ర గాయాలపాలయ్యాయి. భారీ ఆస్తినష్టం జరిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మొదటిసారి భూకంపం వచ్చినప్పుడు, మరోసారి భారీ భూకంపం తలెత్తే అవకాశం లేకపోలేదని SSGEOS పోస్ట్ చేసిన ట్వీట్ను ఫ్రాంక్ రీట్వీట్ చేశాడు. సరిగ్గా మూడు గంటల తర్వాత 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తన అంచనా నిజం కావడంతో.. ఫ్రాంక్ విచారం వ్యక్తం చేశాడు. ఈ భూకంప వార్తలు తనని బాధించాయని పేర్కొన్నాడు. అయితే.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఫ్రాంక్ అంచనాల్ని కొట్టిపారేస్తున్నారు. ఫ్రాంక్ అంచనాలు అశాస్త్రీయమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అతని అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని పేర్కొంటున్నారు.
Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి
కాగా.. టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంప విలయం కారణంగా 3400 మందికి పైగా మృతి చెందారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఊళ్లకు ఊళ్లు శిథిలాలుగా మారిపోయాయి. ఎందరో గాయాలపాలయ్యారు. ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు పది వేలకు చేరే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ శతాబ్దంలోనే దీనిని అతిభీకర భూకంపంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. అటు.. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
తాజావార్తలు
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!