Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
- ఇరాన్పై మోపైన యుద్ధం
- అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు
- హీబ్రూ సందేశంతో వీడియో విడుదల చేసిన యూఎస్
ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్పై యుద్ధం మోపువుతోంది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తాజాగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించినట్లుగానే అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌక నుంచి యుద్ధ విమానాలు.. ఇరాన్పైకి బయల్దేరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రాత్రికి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో సంఘర్షణ తీవ్రతను తెలియజేస్తూ హీబ్రూ సందేశంతో కూడిన ఒక వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. ‘‘ఆపరేషన్ జామ్ అజ్జుమ్’’లో భాగంగా యూఎస్ నేవీ యుద్ధ విమానాలు అబ్రహం లింకన్ (CVN-72) విమాన వాహక నౌక నుంచి బయల్దేరాయి. ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై యూఎస్ దళాలు తమ దాడులను కొనసాగిస్తున్నాయని సందేశంలో పేర్కొన్నాయి.
ట్రంప్ హెచ్చరిక..
ఈ రాత్రికే ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే సర్వ నాశనం అవుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు సంసిద్ధత ప్రకటించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతం అవుతుందని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో ఈ రాత్రి అత్యంత కీలకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాత్రి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 47 ఏళ్ల అణచివేత, అవినీతి, మరణాలకు ఎట్టకేలకు ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించారు.
‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఇక ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది.’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పోస్ట్లో రాశారు.
ఇదిలా ఉంటే ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.
מטוסי קרב של חיל הים האמריקאי ממריאים מנושאת המטוסים אברהם לינקולן (CVN-72) במסגרת מבצע #זעם_עצום. כוחות ארצות הברית ממשיכים לבצע תקיפות נגד מטרות צבאיות בתוך איראן. pic.twitter.com/enFmCc6uwt
— U.S. Central Command – Hebrew (@CENTCOMHebrew) April 7, 2026
తాజావార్తలు
-
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
-
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా కుదరాలా.. అయితే సింపుల్గా ఇలా చేయండి!
-
Video Call: 45, 55 ఏళ్ల మహిళల న్యూడ్ వీడియో కాల్ దందా.. పక్కా ప్లాన్ ప్రకారం ఇలా..
-
Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!