Israel-Hezbollah: పేజర్ల పేలుడు మిస్టరీ బయటపెట్టిన ఇజ్రాయెల్ మాజీ ఏజెంట్లు
- పేజర్ల పేలుడు మిస్టరీ బయటపెట్టిన ఇజ్రాయెల్ మాజీ ఏజెంట్లు
- పదేళ్ల క్రితమే ప్లాన్ అమలు చేసిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో సెప్టెంబర్ 17న ఊహించని విపత్తు తీవ్ర కలకలం రేపింది. హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో హఠాత్తుగా హిజ్బుల్లా చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అనంతరం అంత్యక్రియలు జరిగే సమయంలో కూడా మరోసారి వాకీటాకీల పేలుడు జరిగాయి. పేజర్లు పేలిన మరుసటి రోజే వాకీటాకీలు కూడా పేలిపోయాయి. ఈ ఘటనలో కూడా పలువురు చనిపోయారని వార్తలు వినిపించాయి. ఈ పరిణామాలతో హిజ్బుల్లాతో పాటు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. పేజర్లు, వాకీటాకీలు పేలడం పెద్ద సంచలనంగా మారిపోయింది. అయితే ఇజ్రాయెల్ పనేనంటూ లెబనాన్ ఆరోపించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉంది.
ఇది కూడా చదవండి: Earthquake: ప్రకాశం జిల్లాను వదలని భూప్రకంపనలు.. వరుగా 3 సార్లు కంపించిన భూమి
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
తాజాగా పేజర్లు, వాకీటాకీల పేలుడుపై ఇజ్రాయెల్ మాజీ ఏజెంట్లు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. పేజర్లు కొనగోలు విషయంలో హిజ్బుల్లా ఎలా మోసపోయిందో వెల్లడించారు. రాయిటర్స్ సమాచారం ప్రకారం.. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్.. విదేశీ గడ్డపై అధునాతన కార్యకలాపాలకు సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 17 పేలుడుకు సంవత్సరాల ముందు హిజ్బుల్లా దిగుమతి చేసుకున్న పేజర్లలో పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్ అమర్చిందని పేర్కొంది. ఈ మేరకు ముసుగు వేసుకున్న ఇద్దరు రిటైర్డ్ సీనియర్ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వెల్లడించారు. 10 ఏళ్ల క్రితమే పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చే ప్లాన్ అమలైందని వెల్లడించారు. హిజ్బుల్లా.. తైవాన్ ఆధారిత కంపెనీ నుంచి పేజర్లను కొనుగోలు చేస్తుందన్న విషయం తెలుసుకున్నాక.. ఇజ్రాయెల్ ఎంట్రీ అయి పగడ్బందీగా ప్లాన్ అమలు చేసిందని వెల్లడించారు. హిజ్బుల్లా 16,000 వాకీ-టాకీలను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 17న హిజ్బుల్లా ఉగ్రవాదులు 5,000 పేజర్లను ఉపయోగించారు. అవి పేలిపోయాయి. మరుసటి రోజు మొస్సాద్ వాకీ-టాకీలను యాక్టివేట్ చేశారు. వాటిలో కొన్ని పేజర్ దాడులలో మరణించిన వారి అంత్యక్రియల సమయంలో పేలాయి. ఈ ఘటనల్లో చాలా మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!