Pakistan: పాకిస్తాన్-చైనా స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడ్డారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో రెండు రోజుల క్రితం జరిగిన మిలిటెంట్ దాడిలో ఐదుగురు చైనీయులు చనిపోయారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తు్న్న చైనా జాతీయులే టార్గెట్గా ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడిపై అటు చైనా, ఇటు పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా-పాకిస్తాన్ స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ గురువారం పేర్కొంది. నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించింది.
Read Also: Taj Mahal: తాజ్ మహల్ని శివాలయంగా ప్రకటించాలి.. విచారణకు స్వీకరించిన కోర్టు..
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని షాంగ్లా జిల్లాలో పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కు చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వాళ్లంతా దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఈ పేలుడులో కనీసం ఐదుగురు చైనా జాతీయులు మరణించారు. వారితో పాటు డ్రైవర్ కూడా మరణించాడు. 2021 నుంచి చైనా నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందిపై ఇది రెండో ఆత్మాహుతి దాడి.
ఈ దాడిపై పాకిస్తాన్, చైనా ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అన్నారు. పాక్-చైనా సన్నిహిత సోదరులని, రెండు దేశాల స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడికి పాల్పడినట్లు ఆమె అన్నారు. ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. పాక్, చైనాలు ఉగ్రవాదులపై కృతనిశ్చయంతో వ్యవహరిస్తాయని, వారిని ఓడించాలని ఆమె అన్నారు. పాకిస్తాన్ లోని చైనా పౌరులకు, ప్రాజెక్టులకు రక్షణ, భద్రత ఇవ్వడానికి పాకిస్తాన్, చైనాతో కలసి పనిచేస్తూనే ఉంటుందని చెప్పింది.
తాజావార్తలు
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?