Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magnetic reversal: సమస్త జీవావరణానికి భూమి ఆధారం. ప్రస్తుతం మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవులకు అనుకూలంగా ఉంది. భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తోంది. భూమి మధ్యలో కోర్ తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమిపైకి విశ్వం, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ కిరణాలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భూమికి ఉండే ఈ అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాన్ని రక్షిస్తోంది. ఇది ఒక బుడగ మాదిరిగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.
Read Also: Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం.. భూమి అయస్కాంత ధృవాలు మారుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ ధృవాలు పరస్పరం మారుతున్నాయని బీబీసీ సైన్స్ ఫోకస్ వెల్లడించింది. 1990ల వరకు ఉత్తర ధృవం ఏడాదికి 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ రేటు ఏడాదికి 55 కిలోమీటర్ల మేర సైబీరియా వైపు పెరిగింది. ఈ కదలిక ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలను మార్చే ‘‘మాగ్నెటిక్ రివర్సర్’’కి దారి తీయవచ్చు. నాసా ప్రకారం.. 83 మిలియన్ ఏళ్లలో ఇది 183 సార్లు జరిగింది. అయితే, ఈ ప్రక్రియ మధ్య సమయాలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సగటున సుమారు 3,00,000 ఏళ్లకు ఒకసారి ఇలా మాగ్నెటిక్ రివర్సల్ చోటు చేసుకున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఒకానొక దశలో ధృవాలు మారే సందర్భంలో మాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుంది.
అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే పరిస్థితి ఏంటి..?
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సమస్త జీవులను, సాంకేతిక వ్యవస్థలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అదృశ్య కవచం భూమి యొక్క అంతర్భాగం నుండి అంతరిక్షంలోకి విస్తరించి, ఒక రక్షిత బుడగను ఏర్పరుస్తుంది. సూర్యుని నుండి వెలువడే ఆవేశిత కణాల ప్రవాహం నుండి గ్రహాన్ని కాపాడుతుంది. అయితే ఈ కీలకమైన అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే? విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత దెబ్బతింటుంది. ప్రాణాంతక రేడియేషన్ భూమిని చేరుతుంది. తద్వారా జీవ కణాల మ్యుటేషన్ రేటు పెరుగుతుంది. జంతువుల్లో క్యాన్సర్లకు దారి తీస్తుంది. వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. సౌర కుటుంబంలో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై కూడా నీరు ఉండేది. అయితే దానికి భూమిలా బలమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో ఈ గ్రహం ఇప్పుడు బంజేరు భూమిలా మారింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!