Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magnetic reversal: సమస్త జీవావరణానికి భూమి ఆధారం. ప్రస్తుతం మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవులకు అనుకూలంగా ఉంది. భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తోంది. భూమి మధ్యలో కోర్ తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమిపైకి విశ్వం, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ కిరణాలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భూమికి ఉండే ఈ అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాన్ని రక్షిస్తోంది. ఇది ఒక బుడగ మాదిరిగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.
Read Also: Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..
Also Read
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
- Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం.. భూమి అయస్కాంత ధృవాలు మారుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ ధృవాలు పరస్పరం మారుతున్నాయని బీబీసీ సైన్స్ ఫోకస్ వెల్లడించింది. 1990ల వరకు ఉత్తర ధృవం ఏడాదికి 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ రేటు ఏడాదికి 55 కిలోమీటర్ల మేర సైబీరియా వైపు పెరిగింది. ఈ కదలిక ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలను మార్చే ‘‘మాగ్నెటిక్ రివర్సర్’’కి దారి తీయవచ్చు. నాసా ప్రకారం.. 83 మిలియన్ ఏళ్లలో ఇది 183 సార్లు జరిగింది. అయితే, ఈ ప్రక్రియ మధ్య సమయాలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సగటున సుమారు 3,00,000 ఏళ్లకు ఒకసారి ఇలా మాగ్నెటిక్ రివర్సల్ చోటు చేసుకున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఒకానొక దశలో ధృవాలు మారే సందర్భంలో మాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుంది.
అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే పరిస్థితి ఏంటి..?
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సమస్త జీవులను, సాంకేతిక వ్యవస్థలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అదృశ్య కవచం భూమి యొక్క అంతర్భాగం నుండి అంతరిక్షంలోకి విస్తరించి, ఒక రక్షిత బుడగను ఏర్పరుస్తుంది. సూర్యుని నుండి వెలువడే ఆవేశిత కణాల ప్రవాహం నుండి గ్రహాన్ని కాపాడుతుంది. అయితే ఈ కీలకమైన అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే? విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత దెబ్బతింటుంది. ప్రాణాంతక రేడియేషన్ భూమిని చేరుతుంది. తద్వారా జీవ కణాల మ్యుటేషన్ రేటు పెరుగుతుంది. జంతువుల్లో క్యాన్సర్లకు దారి తీస్తుంది. వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. సౌర కుటుంబంలో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై కూడా నీరు ఉండేది. అయితే దానికి భూమిలా బలమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో ఈ గ్రహం ఇప్పుడు బంజేరు భూమిలా మారింది.
తాజావార్తలు
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
Super Subbu: నెట్ఫ్లిక్స్లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
-
Lenin Pre Release Event: రేపే గ్రాండ్గా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ సస్పెన్స్!
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!