Solar storm: గంటకు 21 లక్షల కి.మీ వేగంతో భూమిని ఢీకొన్న ‘‘సౌర తుఫాను’’.. ఏం జరిగిందంటే..
- భూమిని ఢీకొట్టిన శక్తివంతమైన ‘‘సౌర తుఫాను’’..
- తీవ్ర ఒత్తిడికి లోనైన భూ అయస్కాంత క్షేత్రం..
- శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్కి హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar storm: భూమి పైకి శక్తివంతమైన సౌర తుఫాను దూసుకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెకనుకు 600 కి.మీ అంటే గంటకు సుమారుకుగా 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. దీని ప్రభావంతో భూమి ‘‘అయస్కాంత క్షేత్రం’’ తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఆగస్టు 20న సూర్యుడిపై ఉన్న AR 4199 చురుకైన ప్రాంతం నుంచి M2.7-క్లాస్ సౌర జ్వాల (solar flare) విడుదలైంది. దీని తర్వాత వెంటనే అనేక కరోననల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) విడుదలయ్యాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి అత్యంత ప్రమాదకరమైన కానిబల్ CMEగా మారాయి. ఇలా ఒకదానితో ఒకటి కలిసి పోవడంతో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ సౌర తుఫానులు G1 (తక్కువ) నుండి G3 (బలమైన) స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 1న రాత్రి సమయంలో ఈ సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. వీటి ఫలితంగా ధ్రువాలకు సమీపంలో అరోరాలు కనిపించాయి. పవర్ గ్రిడ్స్, జీపీఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్లు, హై ఫ్రీక్వెన్నీ రేడియో వ్యవస్థలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
Read Also: Ashok Gajapathi Raju: గోవాకు గవర్నర్గా వెళ్లడం నా అదృష్టం: అశోక్ గజపతి రాజు
భూమికి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉండటంతో సూర్యుడి నుంచి వచ్చే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్లాస్మాని తిప్పికొడుతుంది. శక్తివంతమైన సౌర తుఫాను వచ్చినప్పుడు భూమి అయస్కాంత క్షేత్రం ఒత్తిడికి గురవుతుంది. తాజాగా సంఘటనలో కూడా ఇదే జరిగింది. ఎర్త్ మాగ్నిటిక్ ఫీల్డ్ వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదాలు భూమిపై ఉన్న జీవరాశులు తప్పించుకోగలుగుతున్నాయి.
ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్-25లో అత్యంత చురుకుగా ఉన్నాడు. ఈ సమయంలో సూర్యుడిపై భారీ విస్పోటనాలు సంభవిస్తున్నాయి. ఇవి 2025-26 నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్స్పాట్స్ ఏర్పడుతుంటాయి. వీటి నుంచి ఒక్కసారిగా పేలుళ్లు జరిగి అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది. ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!