Trump: ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం.. ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ
- ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం
- ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ
- ఇరాన్పై కీలక వ్యా్ఖ్యలు చేసిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి ఎప్పుడూ విచిత్రంగా ఉంటుంది. ఏం చేసినా భిన్నంగా ఉండాలని అనుకుంటారో ఏమో తెలియదు గానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి.
విజయవంతమైన అబ్బాయిలంటే తనకు ద్వేషం అని.. ఓడిపోయిన వాళ్లతో తిరగడమే తనకు ఇష్టం అని వ్యాఖ్యానించారు. మయామిలోని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్లో ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ‘‘సెక్స్’’, ‘‘మీకు నచ్చిన ఏ విషయం గురించైనా’’ స్వేచ్ఛగా ప్రశ్నలు అడగాలని కోరారు. దీంతో ట్రంప్కు అనేక ప్రశ్నలు సంధించారు.
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
ప్రపంచ వ్యాప్తంగా ఏ నాయకత్వ లక్షణం కొరవడిందని ప్రశ్న రాగానే ‘‘గెలవడమే’’ అత్యంత ముఖ్యమైన అంశం అని ట్రంప్ బదులిచ్చారు. జీవితంలోని ఇతర రంగాల్లో కాకుండా.. క్రీడా ఫలితాల్లో స్పష్టంగా.. తక్షణమే ఉంటాయని.. దీంతో క్రీడలను ఉదాహరణగా తీసుకుని.. విజయం, అపజయాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.
విజయవంతమైన వ్యక్తులు తమ విజయాల గురించి మాట్లాడటం.. వినడం తనకు ఇష్టం ఉండదని.. విఫలమైన వారితో తిరగడానికి ఇష్టపడతానని చెప్పారు. ఎందుకంటే అది తనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇక తన విజయాన్ని వినడానికి ఇష్టపడే వ్యక్తులంటే మాత్రం ఇష్టమని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా 2020లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీని గుర్తుచేశారు. సులేమానీ గొప్ప నాయకుడు.. పిచ్చి మేధావి అని అభివర్ణించారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కూడా మరణించారని పేర్కొన్నారు. ఇటీవలి అమెరికా జరిపిన సైనిక చర్యలతో ఇరాన్ నాయకత్వాన్ని సమర్థవంతంగా కూల్చివేశాయన్నారు. అంతేకాకుండా ఇరాన్ నౌకాదళం కూడా నాశనమైపోయిందని.. అలాగే వారి వైమానిక దళం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిందని పేర్కొన్నారు. క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ ఫ్యాక్టరీలు, రక్షణ మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు.
ఇరాన్ ఇప్పుడు చర్చలు కోరుకుంటోందని.. ఒప్పందం కోసం వేడుకుంటున్నారని తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ సమీక్షిస్తోందన్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీతో పాటు భద్రతా అధిపతి అలీ లారిజానీతో సహా పలువురు ఉన్నతాధికారులు హత్యకు గురయ్యారు. ఇరాన్ అధికారుల ప్రకారం.. 175 మంది పాఠశాల బాలికలతో సహా కనీసం 1,900 మంది మరణించారు.. 32 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Trump: I hang out with losers because it makes be feel better. I hate guys that are very, very successful and you have to listen to their success stories. I like people that like to listen to my success. pic.twitter.com/OYNXspphxo
— Acyn (@Acyn) March 27, 2026
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!