COVID-19 Alert: వామ్మో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- ఒహియో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు..
- కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID-19 Alert: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. సకాలంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. అయితే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా యూఎస్ లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ కావడంతో, సెలవులను ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. తీర ప్రాంతాలు, టూరిస్టు ప్రదేశాలకు తరలిపోవడంతో ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.
Read Also: HHVM : నైజాం సొంత రిలీజ్ కాదు.. రంగంలోకి ‘’అమెరికా సుబ్బారావు’’
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
ఇక, ఒహియో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. NB.1.8.1, XFG అనే కొత్త వేరియంట్లు ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ల ప్రభావంతో గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె బరువుగా ఉండటం లాంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని త్వరగా నియంత్రించవచ్చన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు రద్దీ ప్రదేశాలకు వెళ్తే మాస్కులు ధరించాలని చెప్పుకొచ్చారు. అలాగే, సామాజిక దూరాన్ని కూడా ప్రజలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!