COVID-19 Alert: వామ్మో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- ఒహియో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు..
- కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID-19 Alert: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. సకాలంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. అయితే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా యూఎస్ లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ కావడంతో, సెలవులను ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. తీర ప్రాంతాలు, టూరిస్టు ప్రదేశాలకు తరలిపోవడంతో ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.
Read Also: HHVM : నైజాం సొంత రిలీజ్ కాదు.. రంగంలోకి ‘’అమెరికా సుబ్బారావు’’
Also Read
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
ఇక, ఒహియో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. NB.1.8.1, XFG అనే కొత్త వేరియంట్లు ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ల ప్రభావంతో గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె బరువుగా ఉండటం లాంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని త్వరగా నియంత్రించవచ్చన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు రద్దీ ప్రదేశాలకు వెళ్తే మాస్కులు ధరించాలని చెప్పుకొచ్చారు. అలాగే, సామాజిక దూరాన్ని కూడా ప్రజలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!