Queen Elizabeth-2: ఎడింబర్గ్కు రాణి భౌతికకాయం.. సంతాపం తెలిపిన నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Queen Elizabeth-2: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 చివరియాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. రాణి శవపేటికపై స్కాట్లాండ్ రాచరిక జెండాను కప్పి దానిపై పుష్పగుచ్ఛంతో అలంకరించారు. ఆరు గంటల ప్రయాణానంతరం రాణి భౌతికకాయం ఎడింబర్గ్కు చేరుకుంది. అక్కడ హోలీరూడ్హౌస్లోని సింహాసన గదిలో సోమవారం మధ్యాహ్నం వరకూ శవపేటికను ఉంచనున్నారు. స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్, ఇతర నేతలు దివంగత రాణికి అంతిమ నివాళులర్పిస్తారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్లోని బకింగ్హాం ప్యాలెస్కు తరలిస్తారు. ఈ నెల 19న వెస్ట్మినిస్టర్ అబేలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు.
బ్రిటన్ నూతన రాజు ఛార్లెస్-3ను ఒటావాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కెనడా దేశాధినేతగా అధికారికంగా ప్రకటించారు. రాణి ఎలిజబెత్-2 మృతి చెందిన వెంటనే ఛార్లెస్ కెనడాకు రాజుగా అవతరించారు. అయితే బ్రిటన్లో మాదిరిగా కెనడాలో కూడా ఓ అధికారిక కార్యక్రమం నిర్వహించడం రాజ్యాంగ ప్రక్రియ. అనంతరం కొత్త రాజును ప్రకటించడం సంప్రదాయం. బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల్లో ఒకటిగా ఉన్న కెనడాకు యూకే రాజే దేశాధినేతగా వ్యవహరిస్తారు. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Funeral of Krishna Raja: అధికార లాంఛనాలతో.. నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు
ఎలిజబెత్-2 మృతి నేపథ్యంలో ఆదివారం భారత్ జాతీయ సంతాపదినంగా పాటించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేశారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!