China: ప్రారంభం అయిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు.. మూడోసారి అధ్యక్ష పీఠం కైవసం దిశగా జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping opens 20th Communist Party Congress: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ 20వ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో రాజధాని బీజింగ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్ పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 16 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. దాదాపుగా 2300 కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Read Also: Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
బీజింగ్ లోని తియానన్ మెన్ స్వ్కేర్ కు పశ్చిమాన ఉన్న గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అద్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో 200 మందితో ఉండే సెంట్రల్ కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నారు. 25 మందితో పొలిట్ బ్యూరో, శక్తివంతమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. రాబోయే ఐదేళ్లకు కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలు, దేశం అభివృద్ధి గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జిన్ పింగ్ తన కొత్త పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ రెండు పర్యాయాలు పనిచేశారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించనున్నారు.
ఇదిలా ఉంటే ప్రారంభ ప్రసంగంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనను కొనియాడారు జిన్ పింగ్. హాంకాంగ్ పై చైనా పూర్తి నియంత్రణ సాధించిందని ఆయన అన్నారు. తైవాన్ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని ఖండించారు. తైవాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 2018లో అధ్యక్ష పదవిని రెండుసార్లు చేపట్టాలనే నియమాలను జిన్ పింగ్ తొలిగించారు. 2012లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న జిన్ పింగ్, పదేళ్ల పాటు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం మూడోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా జిన్ పింగ్ పేరు సంపాదించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా జీ జిన్ పింగ్ మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..