China: ప్రారంభం అయిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు.. మూడోసారి అధ్యక్ష పీఠం కైవసం దిశగా జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping opens 20th Communist Party Congress: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ 20వ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో రాజధాని బీజింగ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్ పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 16 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. దాదాపుగా 2300 కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Read Also: Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
Also Read
- Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
- Sheikh Hasina: "నరహంతకురాలు".. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
బీజింగ్ లోని తియానన్ మెన్ స్వ్కేర్ కు పశ్చిమాన ఉన్న గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అద్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో 200 మందితో ఉండే సెంట్రల్ కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నారు. 25 మందితో పొలిట్ బ్యూరో, శక్తివంతమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. రాబోయే ఐదేళ్లకు కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలు, దేశం అభివృద్ధి గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జిన్ పింగ్ తన కొత్త పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ రెండు పర్యాయాలు పనిచేశారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించనున్నారు.
ఇదిలా ఉంటే ప్రారంభ ప్రసంగంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనను కొనియాడారు జిన్ పింగ్. హాంకాంగ్ పై చైనా పూర్తి నియంత్రణ సాధించిందని ఆయన అన్నారు. తైవాన్ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని ఖండించారు. తైవాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 2018లో అధ్యక్ష పదవిని రెండుసార్లు చేపట్టాలనే నియమాలను జిన్ పింగ్ తొలిగించారు. 2012లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న జిన్ పింగ్, పదేళ్ల పాటు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం మూడోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా జిన్ పింగ్ పేరు సంపాదించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా జీ జిన్ పింగ్ మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!