Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ డ్యామ్ భూమి తిరగడాన్ని స్లో చేయడంతో భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
త్రీగోర్జెస్ డ్యామ్లో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ సామర్థ్యం 22,500 మెగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్ కేంద్రాలతో దాదాపు సమానం అన్నమాట. ఈ భారీ డ్యామ్తో అన్ని లాభాలే కలుగుతాయని అనుకోవడం పొరపాటే. ఈ డ్యాంలో నీటి నిల్వ దెబ్బకు భూపరిభ్రమణ వేగం తగ్గిపోయింది. రిజర్వాయర్లో నిలిచే నీటి బరువుతో పాటు డ్యామ్ నుంచి 150 మీటర్ల ఎత్తులో విడుదలయ్యే నీటి కారణంగా ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్పడిందని నాసా సైంటిస్టులు గుర్తించారు. దీని కారణంగా భూమి పరిభ్రమణ వేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని వారు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
Monkeypox: అమెరికాలో మంకీపాక్స్ కల్లోలం…7 రాష్ట్రాల్లో గుర్తింపు
అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల భూమి అడుగున ఒత్తిడి పెరిగి తరచూ భూకంపాలు కూడా వస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్యామ్ వల్ల విడుదలయ్యే నీటి కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. పంటలు కూడా తీవ్రస్థాయిలో దెబ్బతింటున్నాయి.
గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు ఇనెర్షియా నెలకొని సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!