Canada: ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్కి కెనడా పార్లమెంట్ నివాళి.. 1985 “ఎయిర్ ఇండియా” ఘటనను గుర్తు చేసిన భారత్..
- మరోసారి తన బుద్ధి బయటపెట్టిన కెనడా..
- ఖలిస్తానీ నిజ్జర్కి పార్లమెంట్లో నివాళి..
- గతేడాది హత్యకు గురైన నిజ్జర్..
- 1985 ఎయిర్ ఇండియా కనిష్కని గుర్తు చేసిన భారత్..
Canada: కెనడా మరోసారి తన భారత వ్యతిరేకితను బయటపెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిగ్గులేకుండా మద్దతు తెలుపుతోంది. తాజాగా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రసంస్థ చీఫ్, గతేడాది చంపివేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్కి పార్లమెంట్లో నివాళులు అర్పించింది. భారతదేశ విదుదల చేసిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్ కూడా ఉన్నాడు. నిజ్జర్ మరణించి ఏడాది గడిచిన సందర్భంగా కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్లో కొద్దిసేపు మౌనం పాటించింది.
కెనడా చర్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబులు పెట్టి 329 మంది మరణానికి కారణమైన ఘటనను గుర్తు చేసింది. మరణించిన వారి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు స్లాన్లీ పార్క్లోని సెపర్లీ ప్లే గ్రౌండ్లో భారత రాయబార కార్యాలయం నిర్వహించనుంది. ‘‘ఉగ్రవాదం యొక్క ముప్పును ఎదుర్కోవడంలో భారతదేశం ముందంజలో ఉంది మరియు ఈ ప్రపంచ ముప్పును ఎదుర్కోవటానికి అన్ని దేశాలతో కలిసి పని చేస్తుంది. ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్లో 86 మంది పిల్లతో సహా 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పౌర విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద సంబంధిత వాయు విపత్తులలో ఒకటిగా ఉంది. 23 జూన్ 2024 39వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది’’ అని ఇండియన్ కాన్సులేట్ ఎక్స్ లో ట్వీట్ చేసింది.
Also Read
Read Also: Visakhapatnam KGH: పుట్టిన బిడ్డ కోసం తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లిన ఘటన..(వీడియో)
గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ నిజ్జర్ మరణించారు. ఈ కేసులో కరణ్ బ్రార్, అమన్దీప్ సింగ్, కమల్ప్రీత్ సింగ్ మరియు కరణ్ప్రీత్ సింగ్లతో సహా నలుగురు భారతీయులు నిజ్జర్ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హత్య ఇండియా – కెనడాల మధ్య తీవ్ర విబేధాలకు కారణమైంది. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం ఏర్పడింది. స్వయంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ… ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇవి అసంబద్ధ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని దుయ్యబట్టింది.
కొన్నేళ్లుగా, నిజ్జర్ కార్యకలాపాలకు సంబంధించి భారతదేశం అనేకసార్లు తన ఆందోళనను తెలియజేసింది. 2018లో, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వాంటెడ్ వ్యక్తుల జాబితాను ప్రధాని జస్టిన్ ట్రూడోకు నిజ్జర్ పేరుతో ఇచ్చారు. 2022లో, పంజాబ్ పోలీసులు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న కేసుల్లో నిజ్జార్ను అప్పగించాలని కోరింది. 2017 లూథియానా పేలుడుతో సహా వివిధ కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 42 మంది గాయపడ్దారు. అంతకుముందు పాటియాలోని ఓ దేవాలయం సమీపంలో బాంబు పేలుడులో నిజ్జర్ పాత్రపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!