Pakistan: ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి ‘‘మధ్యవర్తి’’గా వ్యవహరించామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటోంది. తమ వల్లే యుద్ధం ఆగిందని సొంత దేశంలో భారీగా ప్రచారం చేసుకుంటుంది. పాకిస్తాన్ తనను తాను గొప్ప దౌత్యశక్తిగా ప్రదర్శించుకుంటోంది. అయితే, పాకిస్తాన్ గర్వాన్ని నేలకు దించుతూ సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘దౌత్య విజయం’’ పాకిస్తాన్కు అన్నం పెట్టదు అని ఆయన పేర్కొనడం పాకిస్తాన్ పరువును తీసేసింది.
ఒక ప్రపంచ సదస్సులో మాట్లాడుతూ.. ఇరాన్ సంక్షోభ సమయంలో పాకిస్తాన్ దౌత్యపరమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ, దీని వల్ల అమెరికా దృష్టిలో కాస్త ప్రతిష్ట పెరుగుతుందని కౌసికన్ అన్నారు. కానీ ఇది నిజమైన పాక్ సమస్యల్ని పరిష్కరించదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ను వైఫల్యం అంచున్న ఉన్న దేశంగా అభివర్ణిస్తూ.. దాని సమస్య భారత్, ఆఫ్ఘనిస్తాన్ కదాని, దాని సొంత దేశ రాజకీయ నాయకులు, సైన్యమే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దుస్థితికి దాని విధానాలు, ఏళ్ల తరబడి దారుణమైన పాలనే కారణమని చెప్పారు.
ప్రతీ దానికి భౌగోళిక పరిస్థితుల్ని నిందించడం, కేవలం సాకు మాత్రమే అని కౌసికన్ అన్నారు. పాకిస్తాన్లో పేలవమైన పాలన ఉందని, దాని నుంచి బయటపడే దారి ఏదీ కనిపించడం లేదని చెప్పారు. పాక్ రాజకీయ నాయకులందరూ కాలక్షేపం పనిచేసే వారని, పాక్ సమస్యలకు సైన్యం కూడా కారణమే అని అన్నారు. ఇటీవల మధ్యవర్తిగా దౌత్యవిజయం సాధించినప్పటికీ అమెరికా పాక్పై ఉన్న అన్ని ఆంక్షల్ని ఎత్తివేసే అవకాశం లేదని చెప్పారు.
A Pakistani journalist asks: Where will Pakistan be in 5 years?
Former Singapore diplomat Bilahari Kausikan replies bluntly: "Pakistan SEIZED a diplomatic moment in the US-Iran tensions, but that won’t FEED your people. It’s been on the brink of FAILURE for years." 🔥…
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 3, 2026

