Hike And Seek: హైడ్ & సీక్ ఆడుతూ.. దేశం దాటిన కుర్రాడి కథ సుఖాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladeshi Kid Playing Hide and Seek Reaches Malaysia: హైడ్ అండ్ సీక్ గేమ్.. ఓ పసివాడిని దేశం దాటించేసింది. తన స్నేహితులతో కలిసి ఆ ఆట ఆడుతూ అతడు ఓ కంటైనర్లో దాక్కోగా.. దాన్ని ఓడలో ఎక్కించడం, అది పరాయి దేశానికి వెళ్లడం జరిగింది. ఒక దేశంలో కంటైనర్లోనికి వెళ్లిన అతడు, కంటైనర్ తెరవగానే మరో దేశంలో తేలాడు. ఆ బాలుడ్ని చూసి తొలుత ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. చివరికి జరిగిన తప్పిదాన్ని గుర్తించి, అతడ్ని స్వదేశానికి చేర్చారు. దీంతో ఆ బాలుడి కథ సుఖాంతం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Myanmar Woman Molested: ఢిల్లీలో దారుణం.. మయన్మార్కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారం
Also Read
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్కు చెందిన బాలుడు రతుల్ ఇస్లామ్ ఫహిమ్ ఒనే కుర్రాడు తన కుటుంబసభ్యులతో కలిసి ఒక పోర్టు ఏరియాలో ఉంటున్నాడు. జనవరి 11వ తేదీన అతడు తన ఫ్రెండ్స్తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆట ఆడాడు. ఈ ఆట ఆడుతున్న సమయంలో.. సమీపంలో ఉండే ఓ కంటైనర్లో దాక్కున్నాడు. ఆ వెంటనే పోర్టు సిబ్బంది దాన్ని తనిఖీ చేయకుండా.. ఓడలోకి ఎక్కించేసింది. అక్కడి నుంచి ఆ ఓడ ప్రయాణం సాగిస్తూ.. జనవరి 17వ తేదీన మలేషియాకు చేరుకుంది. ఆ కంటైనర్లో ఇరుక్కున్నప్పటి నుంచి ఆ కుర్రాడు శబ్దాలు చేస్తూ, గట్టిగా కేకలు పెట్టాడు కానీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఎవ్వరికీ అతని అరుపులు వినిపించలేదు. అయితే.. మలేషియాకు ఓడ చేరుకున్న తర్వాత ఓ ఉద్యోగి ఆ కంటైనర్లో నుంచి శబ్దాలు రావడం గమనించాడు. అప్పుడు వెంటనే అతడు తన సహచరులకు సమాచారం ఇచ్చాడు.
Greece Train Accident: గ్రీస్లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రైళ్లు.. 26 మంది మృతి
లోపల ఎవరున్నారోనన్న భయంతో.. ఆ ఓడ సిబ్బంది కంటైనర్ని తెరిచారు. అప్పుడు వాళ్లకు లోపల ఫహిమ్ కనిపించాడు. వారం రోజుల పాటు తిండి, నీరు లేక అతడు నీరసించిపోయాడు. ఈ పిల్లాడు సమాచారం తెలుసుకున్న అధికారులు.. పోర్టు వద్దకు వాలిపోయారు. అతనికి చికిత్స అందించారు. తొలుత మానవ అక్రమ రవాణా ముఠా ఆ పిల్లాడ్ని తీసుకొచ్చిందేమోనని అధికారులు అనుమానించారు. కానీ.. విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. బాలుడు కోలుకున్నాక పొరపాటున ఎక్కానని చెప్పాడు. ఫైనల్గా బంగ్లాదేశ్ హై కమిషనర్తో మాట్లాడి, చిన్నారిని స్వదేశానికి పంపించారు. దేవుడి దయతో బాలుడు తన స్వదేశానికి క్షేమంగా చేరుకున్నాడని మలేసియా ఇంటీరియర్ మినిస్టర్ సైఫుద్దీన్ నసూషన్ ట్వీట్ చేశారు.
Rishabh Pant: జీవితం విలువ తెలిసింది.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!