Greece Train Accident: గ్రీస్లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రైళ్లు.. 26 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26 dead 85 injured As Two Trains Collide In Greece: గ్రీస్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న కార్గో రైలుని ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 26 మంది దుర్మరణం చెందగా.. 85 మందికి పైగా గాయాలపాలయ్యారు. గ్రీస్లోని టెంపేలో చోటు చేసుకున్న ఈ క్రాష్లో.. కొన్ని కోచ్లు పట్టాలు తప్పగా, మూడు కోచ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనపై థెస్సాలీ గవర్నర్ కాన్స్టాంటినోస్ అగోరాస్తోస్ మాట్లాడుతూ.. రెండు రైళ్లు ఒకదానికొకరు స్ట్రాంగ్గా ఢీకొన్నాయని, ఈ ఘటనలో ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయని, ముందు భాగంలో ఉండే రెండు కోచ్లు దాదాపు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ప్యాసింజర్స్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 250 మందిని సురక్షితంగా కాపాడగలిగామని అగోరాస్తోస్ పేర్కొన్నారు.
Tomato Price: ఆకాశాన్నంటిన టమోటా ధర.. పిజ్జాపై భారీ ఎఫెక్ట్
Also Read
మరోవైపు.. అగ్నిమాపక సిబ్బందికి చెందిన వాసిలిస్ వార్తకోయియానిస్ మాట్లాడుతూ, తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రెండు రైళ్లు ఢీకొనడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు. దట్టమైన పొగలోనూ చూసేందుకు వీలుగా రెస్క్యూయర్స్ ‘సీథ్రూ’ దుస్తుల్ని ధరించారని, శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 150 మంది ఫైర్ ఫైటర్స్, 17 వాహనాలు, 40 ఆంబులెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. శిథిలాలను తొలగించేందుకు క్రేన్లను తెప్పించి, రైలు కోచ్లను పైకి లేపనున్నట్లు గవర్నర్ అగోరాస్తోస్ వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని సంప్రదించినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. కాగా.. ప్యాసింజర్ రైలు థెస్సాలోనికి నుంచి లారిస్సాకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
Student Sathvik: కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్మ.. ఆ టార్చరే కారణం
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?