Bangladesh: నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు.. సాయంత్రం నుంచే ఫలితాలు
- నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు
- ఉ.7:30 నుంచి సా.4:30 వరకు ఓటింగ్
- సాయంత్రం నుంచే ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ సంక్షోభం, హింస, హిందువుల హత్య తర్వాత గురువారం బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అభ్యర్థి మరణంతో ఒక స్థానంలో పోలింగ్ నిలిపివేశారు. మిగతా 299 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 మిలియన్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ఇది కూడా చదవండి: Off The Record: గులాబీని గట్టిగా కొడితేనే తెలంగాణలో కమల వికాసమా..?
తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ఎన్నికల్లో ముందస్తు ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దాని మిత్రపక్షం, షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఇ-ఇస్లామి(జేఐఐ) వెనుకంజలో ఉంది. రాజకీయ విశ్లేషకుడు డేనియల్ రెహమాన్ ప్రకారం బీఎన్పీ విజయం సాధించవచ్చని అంచనా వేశాడు. ఆగస్టు 2024లో విద్యార్థుల నేతృత్వంలో చెలరేగిన హింస కారణంగా 15 ఏళ్ల హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇక 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమన్ లండన్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చాడు.
ఇక ఈసారి ప్రతి ఓటరు 2 ఓట్లు వేయనున్నారు. ఒకటి ఎన్నికల కోసం కాగా.. ఇంకొకటి రాజ్యాంగం మార్పు కోసం ఓటు వేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం తెల్ల బ్యాలెట్ పత్రాలు ఉండగా.. రాజ్యాంగ సవరణ కోసం గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!