Hajj Pilgrims: నిప్పుల కొలిమిలా “హజ్ యాత్ర”.. 68 మంది భారతీయులతో పాటు 1000కి పైగా మృతి..
- హజ్ యాత్రలో పెరుగుతున్న మరణాలు..
- 68 మంది భారతీయులతో సహా 1000 దాటిని మృతుల సంఖ్య..
- వేడి తీవ్రతతో అల్లాడుతున్న యాత్రికులు..
- ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన మరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hajj Pilgrims: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ‘‘హజ్ యాత్ర’’ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. దారుణమైన వేడి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 68 మంది భారతీయులతో పాటు కనీసం 1000 మంది వరకు వేడి కారణంగా మరణించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. గురువారం కొత్తగా నమోదైన మరణాల్లో ఈజిప్ట్ దేశానికి చెందిన 58 మంది ఉన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన వారిలో మరణించిన వారి సంఖ్య 1000ని దాటింది. ఈజిప్టు నుంచే ఎక్కువ మంది మరణించిన వారు ఉన్నారు. ఈ ఒక్క దేశం నుంచే 658 మంది మరణించారు. మరణించిన 630 మందిని గుర్తించాల్సి ఉంది.
Read Also: UGC-NET: యూజీసీ-నెట్ పునఃపరీక్షపై కేంద్ర విద్యాశాఖ కీలక సమాచారం..
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
ఇండియా నుంచి యాత్రకు వెళ్లిన వారిలో 68 మంది మరణించినట్లు సౌదీ దౌత్యవేత్తలు చెప్పారు. వేడి కారణంగానే మరణాలు చోటు చేసుకుంటున్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు ధృవీకరించారు. గతేడాది 200 మందికి పైగా యాత్రికులు మరణించారు. సౌదీ అరేబియాలో ఆదివారం రోజు 2700 కంటే ఎక్కువ వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రతీ ఏడాది కూడా మరణాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, ఈ ఏడాది మాత్రం అనూహ్యంగా మరణాల సంఖ్య 1000ని దాటింది. హజ్ యాత్రకు కేంద్రంగా ఉన్న మక్కాలో ప్రతీ దశాబ్ధం ఉష్ణోగ్రత 0.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!