Asim Munir: సైనిక ప్రభుత్వం దిశగా పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్కు ఆసిమ్ మునీర్ చెక్..
- పాకిస్తాన్లో మళ్లీ సైనిక ప్రభుత్వం రాబోతోందా..?
- ప్రధాని షెహబాజ్ షరీఫ్ని సైడ్ చేస్తున్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్..
- ఇటీవల అమెరికాలో పర్యటన, ట్రంప్తో డిన్నర్..
- ఇండోనేషియా, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న మునీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asim Munir: పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. సాధారణంగా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని నేతృత్వంలోని బృందం చర్చల్ని నిర్వహిస్తుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఆసిమ్ మునీర్ పలు దేశాల పర్యటనలకు వెళ్లడం, ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడం జరుగుతోంది.
Also Read
- US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
Read Also: Gokarna: మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ.. ఏమైందంటే..
ఇటీవల, ఆసిమ్ మునీర్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. తాజాగా ఆయన శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో పర్యటనలు ఖరారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునే దిశగా సమావేశాలు జరుపుతున్నారు. ఇదంతా చూస్తే ప్రధాని షహజాబ్ షరీఫ్ని సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మునీర్ జూలై 21న కొలంబోకు వెళ్లనున్నారు.
ఉగ్రవాదం, జాతీయ సరిహద్దులను కాపాడుకోవడం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)లో ఇండోనేషియా ముఖ్యమైన అంశాలపై భారతదేశానికి మద్దతు ఇచ్చింది, ఇది పాకిస్తాన్ను కలవరపెట్టింది. ముస్లిం దేశాల్లోలనే పాకిస్తాన్కు పెద్దగా మద్దతు లేదు. ఈ నేపథ్యంలోనే భారత్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే విషయంలో మునీర్ పర్యటనలు ఉండబోతున్నట్లు సమాచారం. పలు సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో ఇండోనేషియా, భారత్కు మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గణతంత్ర దినోత్సవం కోసం భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన తన పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుని మరీ, ఇండియాలో తన పర్యటనను పొడగించుకోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!