NTV Telugu Site icon

Bangladesh: షేక్ హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్‌సీబీఏ వినతి..!

Ban

Ban

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేసి తమ దేశానికి పంపించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఎస్‌సీబీఏ ఆడిటోరియంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాలో హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపణలు చేశారు. అలాంటి వారితో సానుకూల సంబంధాలు ఎలా కొనసాగిస్తారు.. భారత్ దేశ ప్రజలతో బంగ్లాదేశ్ సానుకూల సంబంధాలు కొనసాగించాలని అనుకుంటుంది.. కాబట్టి వెంటనే హసీనా, రెహనాలను తమకు అప్పగించాలని మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ కోరారు.

Read Also: CBI: బ్యాంకులో భారీ మోసం..మారువేషంలో 4 రాష్ట్రాల్లో 20 సంవత్సరాలు గడిపిన నిందితుడు

అయితే, రాజకీయ కార్యకలాపాలు, అవినీతికి పాల్పడిన బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారంలోగా రాజీనామా చేయాలని ఎస్సీబీఏ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో నియామకాలు సరిగ్గా కొనసాగలేదు.. అటార్నీ జనరల్ సహా, రాష్ట్ర న్యాయ అధికారులు, అవినీతి నిరోధక కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషనర్లు వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ఖైదీలను సైతం రిలీజ్ చేయాలన్నారు. ఈ మీటింగ్ కు పలువురు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) అనుకూల లాయర్లు హాజరైయ్యారు.

Read Also: Gyanvapi Case: జ్ఞాన్‌వాపిలో కొత్త ఆలయ నిర్మాణంపై నేడు కోర్టులో విచారణ..

కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలతో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వదిలి భారత్‌కు వెళ్లిపోయారు. అయితే, ఆమె ఢిల్లీలోనే ఉన్నారా లేక వేరే ప్రదేశానికి వెళ్లారా అనే దానిపై క్లారిటీ లేదు. హసీనా ఇండియాలోనే ఉందని పలువురు తెలియజేస్తున్నారు. మరోవైపు, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు ఆ దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు.