IT Layoffs: ఐటీ ఉద్యోగులపై పిడుగు.. రోజుకు 3000 మంది ఉద్యోగాలు ఊస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Layoffs: ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పలు ఐటీ ఉద్యోగులు కుటుంబాల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అని బిక్కుబిక్కమంటున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటివి తమ ఉద్యోగులను తీసేశాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఐటీ ఉద్యోగులను భయపెట్టేలా మరోవార్త వచ్చింది. టెక్ దిగ్గజ కంపెనీలు జనవరిలో నెలలో సగటున ప్రతీరోజూ 3000 మందిని ఉద్యోగులను తొలగిస్తుందని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 166 ఐటీ కంపెనీలు ఇప్పటివరకు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. రానున్న రోజుల్లో ఈ ఉద్యోగాల తీసివేత మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు భారతీయ ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. నిన్నమెన్నటి వరకు లక్షల్లో శాలరీలు తీసుకుని ఆనందంగా ఉన్న వారు ఇప్పుడు తెగ కంగారు పడిపోతున్నారు.
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
- US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
Read Also: iPhone: రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు
ఇటీవల గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు మైక్రోసాఫ్ట 10,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం మందిని, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను 400 మందిని తొలగించింది. రానున్న రోజుల్లో టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఐటీ ప్రొఫెషన్లలో దడపుట్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వస్తుందనే కారణంతో ఐటీ కంపెనీలు ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో ఖర్చును అదుపు చేయాలంటే ఉద్యోగుల తొలగింపు ఒక్కటే మార్గం అని తెలుస్తోంది. రానున్న 6 నెలలు ఏడాది కాలంలో ఆర్థికమాంద్యం తప్పకుండా వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2008 మాంద్యంతో పోలిస్తే ఈ సారి మాంద్యం తీవ్రం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!