IT Layoffs: ఐటీ ఉద్యోగులపై పిడుగు.. రోజుకు 3000 మంది ఉద్యోగాలు ఊస్ట్
IT Layoffs: ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పలు ఐటీ ఉద్యోగులు కుటుంబాల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అని బిక్కుబిక్కమంటున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటివి తమ ఉద్యోగులను తీసేశాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఐటీ ఉద్యోగులను భయపెట్టేలా మరోవార్త వచ్చింది. టెక్ దిగ్గజ కంపెనీలు జనవరిలో నెలలో సగటున ప్రతీరోజూ 3000 మందిని ఉద్యోగులను తొలగిస్తుందని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 166 ఐటీ కంపెనీలు ఇప్పటివరకు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. రానున్న రోజుల్లో ఈ ఉద్యోగాల తీసివేత మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు భారతీయ ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. నిన్నమెన్నటి వరకు లక్షల్లో శాలరీలు తీసుకుని ఆనందంగా ఉన్న వారు ఇప్పుడు తెగ కంగారు పడిపోతున్నారు.
Also Read
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
Read Also: iPhone: రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు
ఇటీవల గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు మైక్రోసాఫ్ట 10,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం మందిని, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను 400 మందిని తొలగించింది. రానున్న రోజుల్లో టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఐటీ ప్రొఫెషన్లలో దడపుట్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వస్తుందనే కారణంతో ఐటీ కంపెనీలు ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో ఖర్చును అదుపు చేయాలంటే ఉద్యోగుల తొలగింపు ఒక్కటే మార్గం అని తెలుస్తోంది. రానున్న 6 నెలలు ఏడాది కాలంలో ఆర్థికమాంద్యం తప్పకుండా వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2008 మాంద్యంతో పోలిస్తే ఈ సారి మాంద్యం తీవ్రం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!