Malaysia: మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. ఐదేళ్ల వ్యవధిలో ఐదో ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anwar Ibrahim sworn in as Malaysia’s PM: మలేషియా ప్రధానిగా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం ఎన్నికయ్యారు. మలేషియా రాజు అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై కొద్ది రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్లు అయింది. శనివారం వెలువడిన సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించలేదు. అయితే యునైటెడ్ మలేషియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తో పొత్తు పెట్టుకున్న అన్వర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Also: 26/11 Mumbai attacks: ఉగ్రవాదులపై చర్యలను అడ్డుకుంటున్నారు.. యూఎన్ వేదికగా చైనాపై పరోక్ష వ్యాఖ్యలు
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
మలేషియాకు పదో ప్రధానిగా అన్వర్ ఎన్నికయ్యారు. అయితే ఇది గత ఐదేళ్లలో ప్రధానిని ఎన్నుకోవడం ఐదోసారి. అన్వర్ ఇబ్రహీం ఎన్నిక కావడంతో మలేషియన్ మార్కెట్లు పుంజుకున్నాయి. అన్వర్ ఇబ్రహీం తన క్యాబినెట్ కూర్పుపై శుక్రవారం చర్చించాలని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మలేషియా ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలే అన్వర్ ఇబ్రహీంకు సవాల్ గా మారనున్నాయి. సుపరిపాలను, అవినీతి నిర్మూలన, న్యాయం స్వాతంత్య్రం, మలేషియన్ల సంక్షేమలో ఎప్పటీకీ రాజీపడబోమని కొత్త ప్రధాని గురువారం ప్రకటించారు.
3.3 కోట్ల జనాభా ఉన్న మలేషియాలో మలాయ్ జాతి, భారత్-చైనీ మైనారిటీల మధ్య చారిత్రాత్మక ఉద్రిక్తతలు ఉన్నాయి. అన్వర్ ప్రభుత్వం వీటిని రూపుమాపుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. శనివారం జరిగి ఎన్నికల ఫలితాల్లో అన్వర్ కు చెందిన పకటాన్ హరపాన్ సంకీర్ణం 82 స్థానాలు సాధించగా.. ముహిద్దీన్ పెరికటన్ నేషనల్ బ్లాక్ 73 స్థానాలను గెలుచుకుంది. బారిసన్ కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు 112 మంది అవసరం అయితే ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. బారిసన్ కూటమి తమకు మద్దతు ఇస్తుందని అన్వర్ చెప్పారు. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!