Alok Sharma : భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారి ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్హుడ్ అవార్డు అందుకోనున్నారు. జనవరి 1న కొత్త సంవత్సర ప్రారంభ రోజున బ్రిటన్ రాజు చార్లెస్ 3 గౌరవించే వ్యక్తుల జాబితాలో అలోక్ శర్మకు చోటు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గుర్తింపుగా అలోక్కు ఈ గౌరవం లభించింది. ఈ ఏడాది బ్రిటన్లో జరిగిన కాప్ 26 సదస్సుకు అలోక్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Read Also: Former Pope Benedict XVI Died: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలతో బ్రిటన్ ఒక ఒప్పందానికి అంగీకరించడంలో అలోక్ కీలకంగా వ్యవహరించారు. ఇది నిజంగా గొప్ప ప్రభావం చూపనుందని బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్, డెవలప్మెంట్ ఆధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్లాస్గో నగరంలో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు కాప్ 26 సదస్సు జరిగింది. ప్రజా సేవలో విశిష్ట కృషి చేసిన 1100 మందిని కొత్త సంవత్సరం బ్రిటన్ రాజు గౌరవించనున్నారు. ఈ జాబితాలో బ్రిటన్ మాజీ రాణి, దివంగత ఎలిజబెత్ 2 గిటారిస్ట్ బ్రయాన్ మే కూడా ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న విదేశీయుల జాబితాకు చెందిన 30 మందిలో అలోక్ శర్మ ఒకరు. అలోక్ శర్మ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 1967వ సంవత్సరం జన్మించారు.