Israel-Gaza: గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు.. 31 మంది మృతి
- గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు
- 31 మంది మృతి.. 80 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Ileana : మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ..
Also Read
ఆదివారం దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) పంపిణీ కేంద్రం దగ్గర ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. పంపిణీ చేస్తున్న సాయాన్ని ప్రజలు అందుకుంటున్నారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడికక్కడే 31 మంది పాలస్తీనియర్లు ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ట్యాంకులు.. ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి
అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వర్గాలు ఖండించాయి. అలాగే ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ కూడా ఖండించారు. ప్రపంచ మీడియా పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. అలాంటి కాల్పులు ఏం జరగలేదని.. అదంతా కేవలం అబద్ధమని తెలిపారు. గాజాలో తమ సహాయ పంపిణీకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందని జీహెచ్ఎఫ్ తెలిపింది. పౌరులపై దాడి జరిగిందన్న హమాస్ ఆరోపణలను ఖండించింది.
ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉన్న ప్రైవేటు సంస్థ జీహెచ్ఎఫ్ మే 26 నుంచి గాజాలో ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. అయితే జీహెచ్ఎఫ్.. ఇజ్రాయెల్ కోసం పని చేస్తోందని.. జనాలను గుమిగూడేలా చేసి అనంతరం కాల్పులు జరిగేలా ప్లాన్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐక్యరాజ్యసమితి.. జీహెచ్ఎస్ యంత్రాంగంపై విమర్శలు గుప్పించింది. మానవతా సూత్రాలను జీహెచ్ఎఫ్ ఉల్లంఘిస్తోందని.. పాలస్తీనియన్లకు ప్రమాదాలను సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. ఇజ్రాయెల్ లక్ష్యాలను తీర్చడానికే జీహెచ్ఎఫ్ పని చేస్తోందని పెద్ద ఎత్తున ఇతర సంస్థల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై హమాస్తో చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలని హమాస్ పట్టుబడుతోంది. అయితే చర్చలు అసంపూర్తినే ముగిశాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!