China: చైనాలో ఘోర ప్రమాదం.. రెస్టారెంట్లో ఎల్పిజి లీక్.. 31 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్పిజి గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో 31 మంది దుర్మరణం పాలయ్యారు. వాయువ్య చైనాలోని యిన్చువాన్లోని రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. బార్బెక్యూ రెస్టారెంట్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీకైంది. 31 మంది మరణించడంతో పాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Read Also: PM Modi US Visit: బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ గిప్ట్స్.. స్పెషల్ అట్రాక్షన్గా గ్రీన్ డైమండ్..
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్రంగా కృషి చేశాయి. పేలుడు ధాటికి రెస్టారెంట్ అద్దాలు ఎగిరిపడ్డాయి. బుధవారం రాత్రి 8.40 గంటలకు నింగ్జియా ప్రావిన్సులోని రాజధాని డౌన్టౌన్ యిన్చువాన్లోని నివాస ప్రాంతంలోని ఫుయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో జరిగింది. మూడు రోజులు పాటు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సెలవు దినం సందర్భంగా చాలా మంది సరదాగా బయటకు వెళ్లిన సమయంలో ఈ పేలుడు సంభవించింది.
గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రజలను రక్షించాలని అధికారులను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశించారు. పేలుడు నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక, రెస్య్కూసేవలు అందించేందుకు 100 పైగా సిబ్బంది, 20 వాహనాలు సంఘటన స్థలానికి చేరాయి. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించి, సాధ్యమైనంతవరకు ప్రాణనష్టం తగ్గించేందుకు అధికారులు ప్రయత్నించారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు రెస్య్కూ ఆపరేషన్ ముగిసింది.
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!