Madagascar: స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madagascar: ఎంతో ఆనందంతో ఆటల పోటీలను చూడటానికి వచ్చిన వారు అనంతలోకాలకు వెళ్లారు. స్టేడియంలో వెళ్లే క్రమంలో గేటు దగ్గర జరిగిన తొక్కిసలాటలో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ద్వీప దేశమైన మడగాస్కర్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మడగాస్కర్ దేశ రాజధాని అంటననారివోలో క్రీడల పోటీల సందర్భంగా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారని.. సుమారు 80 మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని క్రిస్టియన్ ఎన్ట్సే తెలిపారు.
Read Also: OG Teaser: అర్జున్ దాస్ వాయిస్ ఓవర్… సుజిత్ స్టైలిష్ టేకింగ్… పవన్ స్క్రీన్ ప్రెజెన్స్
Also Read
- USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
- Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
11వ ‘ఇండియన్ ఓసియన్ క్రీడల’ పోటీలను అంటననారివోలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో స్టేడియం ముఖద్వారం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. రెడ్క్రాస్ మరియు స్థానిక పార్లమెంటు సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చిన్నారులతో సహా కనీసం 13 మంది మరణించారని తెలిపారు. మరణించిన వారిలో 7 మంది మైనర్లు ఉన్నారని చెప్పారు. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు దాదాపు 50,000 మంది ప్రేక్షకులు చేరుకున్న బరియా స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. విషాదానికి కారణం వెంటనే తెలియరాలేదని.. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెడ్క్రాస్ తెలిపింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకరికొకరు తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తెలిపారు. గత 40 ఏళ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోటీలను ఈసారి ఈ మడగాస్కర్లో నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు హాజరైన మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా ప్రమాదంలో మరణించిన వారికి ఒక నిమిషం మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. హిందూ మహాసముద్ర ద్వీపం గేమ్స్ మడగాస్కర్లో సెప్టెంబర్ 3 వరకు నిర్వహించబడుతున్నాయి. నైరుతి హిందూ మహాసముద్రంలోని వివిధ ద్వీపాలలో సుమారు 40 సంవత్సరాలుగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడా పోటీలు నిర్వహింబడుతున్నాయి. గతంలో ఇవి మారిషస్లో జరిగాయి.
- Tags
- 13 People
- died
- Games
- Madagascar
- stadium
తాజావార్తలు
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
-
Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
-
Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..