Madagascar: స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madagascar: ఎంతో ఆనందంతో ఆటల పోటీలను చూడటానికి వచ్చిన వారు అనంతలోకాలకు వెళ్లారు. స్టేడియంలో వెళ్లే క్రమంలో గేటు దగ్గర జరిగిన తొక్కిసలాటలో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ద్వీప దేశమైన మడగాస్కర్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మడగాస్కర్ దేశ రాజధాని అంటననారివోలో క్రీడల పోటీల సందర్భంగా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారని.. సుమారు 80 మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని క్రిస్టియన్ ఎన్ట్సే తెలిపారు.
Read Also: OG Teaser: అర్జున్ దాస్ వాయిస్ ఓవర్… సుజిత్ స్టైలిష్ టేకింగ్… పవన్ స్క్రీన్ ప్రెజెన్స్
Also Read
- Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్గా బాస్కి చెప్పేస్తుంది!
- Khawaja Asif: ఆ విషయంలో భారత్పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
- Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
11వ ‘ఇండియన్ ఓసియన్ క్రీడల’ పోటీలను అంటననారివోలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో స్టేడియం ముఖద్వారం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. రెడ్క్రాస్ మరియు స్థానిక పార్లమెంటు సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చిన్నారులతో సహా కనీసం 13 మంది మరణించారని తెలిపారు. మరణించిన వారిలో 7 మంది మైనర్లు ఉన్నారని చెప్పారు. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు దాదాపు 50,000 మంది ప్రేక్షకులు చేరుకున్న బరియా స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. విషాదానికి కారణం వెంటనే తెలియరాలేదని.. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెడ్క్రాస్ తెలిపింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకరికొకరు తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తెలిపారు. గత 40 ఏళ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోటీలను ఈసారి ఈ మడగాస్కర్లో నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు హాజరైన మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా ప్రమాదంలో మరణించిన వారికి ఒక నిమిషం మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. హిందూ మహాసముద్ర ద్వీపం గేమ్స్ మడగాస్కర్లో సెప్టెంబర్ 3 వరకు నిర్వహించబడుతున్నాయి. నైరుతి హిందూ మహాసముద్రంలోని వివిధ ద్వీపాలలో సుమారు 40 సంవత్సరాలుగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడా పోటీలు నిర్వహింబడుతున్నాయి. గతంలో ఇవి మారిషస్లో జరిగాయి.
- Tags
- 13 People
- died
- Games
- Madagascar
- stadium
తాజావార్తలు
-
Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్
-
SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
-
Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!