Iran Protests: ఇరాన్లో నరమేధం.. ఎటుచూసినా శవాలే.. 12 వేల మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ కథనాలు!
- ఇరాన్లో నరమేధం
- ఎటుచూసినా శవాలే
- 12 వేల మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ కథనాలు!
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లో నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాల్లో వెలువడుతున్నాయి. టెహ్రాన్లో ఎటుచూసినా నగర వీధుల్లో శవాలు పడి ఉన్నట్లుగా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా వేలాది మంది గాయాలు పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ నేతృత్వంలో ‘ముస్లిం నాటో’గా అడుగులు.. ఏఏ దేశాలంటే..! భారత్కొచ్చే ముప్పేంటి?
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు వారాలకు పైగా ఇరాన్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 2 వేల మంది వరకు చనిపోయినట్లుగా అధికారిక సమాచారం అయినా.. ఆ సంఖ్య 12 వేల మంది వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంటే ఆందోళనలు అణిచివేసేందుకు భద్రతా దళాలు ఊచకోతకు తెగబడినట్లుగా సమాచారం. దీంతో ఎటుచూసినా శవాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇరాన్కు చెందిన ఒక వెబ్సైట్లో 10 వేల మంది చనిపోయినట్లుగా సంచలన కథనంలో పేర్కొంది. ఈ హత్యలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్లో హింస చోటుచేసుకుందని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ కథనం తెలిపింది. తాజాగా జరిగిన అల్లర్లలో 12 వేల మంది చనిపోయినట్లుగా పేర్కొంది. పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, వైద్య బృందం, తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ అంచనా వేసినట్లుగా స్పష్టం చేసింది. జనవరి 8, 9 తేదీల్లో ఈ మరణాలు సంభవించాయని తెలిపింది. ఇరాన్ చరిత్రలో ఇలాంటి హింస ఎప్పుడూ జరగలేదని కథనంలో వెల్లడించింది. ఇక అరెస్టైన వారిలో కూడా చాలా మంది మరణశిక్ష కూడా పడొచ్చని స్పష్టం చేసింది.

గత కొద్దిరోజులుగా ద్రవ్యోల్బణం కారణంగా ఇరానీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు లేక నరక యాతన పడుతున్నారు. దీంతో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై అణిచివేత కారణంగానే ఇంత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నియంతకు మరణశిక్ష విధించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంటే ఖమేనీపై ఏ రేంజ్లో కోపం ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది.
ఇంకో వైపు నిరసనలు కారణంగా ఇరాన్ అంతటా అంధకారం అలుముకుంది. ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. నగదు కొరత ఏర్పడింది. అన్ని రకాలుగా ప్రజా రవాణా ఆగిపోయింది. అన్ని నగరాల్లో ఆందోళనలు ఉధృతం కావడంతో భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి. ఇంకోవైపు అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం కూడా చేతులెత్తేసినట్లుగా సమాచారం. దీంతో ఆయన పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సహచరులు, కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!