UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) వెల్లడించింది. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్లో తొలిసారి 1 బిలియన్ మార్క్ను దాటాయి. మొదటి మూడేళ్లలో కేవలం ఒక బిలియన్ లావాదేవీలే జరగ్గా తర్వాతి మూడేళ్లలో ఏకంగా 5 బిలియన్లు దాటడం గమనార్హం. మన దేశంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య శరవేగంగా వృద్ధి చెందుతోంది అనటానికి ఇది తాజా ఉదాహరణ అని చెప్పొచ్చు.
మన కన్నా అమెరికాలోనే ఎక్కువ
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కన్నా మన దేశమే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది జులై చివరికి యూఎస్లో 32 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపగా ఇండియాలో 11 వేల మందికి పైగా ఉద్వాసన పలికారు. అమెరికాతో పోల్చితే ఇది చాలా తక్కువ. యూఎస్లోని స్టార్టప్స్, పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీలతోపాటు మైక్రోసాఫ్ట్, మెటా(ఫేస్బుక్)లూ ఇదే బాట పట్టాయి. స్టాఫ్ తొలగింపునకు సంబంధించిన ఈ డేటాను ‘క్రంచ్బేస్’ అనే సంస్థ వెల్లడించింది.
GST revenue collections: జీఎస్టీ చరిత్రలో రెండో అత్యధిక వసూళ్ల రికార్డ్
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఈవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 359 పాయింట్లు పెరిగి 57,929.39 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో 17,256 పాయింట్లకు పైనే ట్రేడింగ్ జరుగుతోంది. ఎం &ఎం షేర్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో పెరిగింది. త్వరలోనే రూ.1500కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రిలయెన్స్, మారుతీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ తదితర సంస్థలకు లాభాలు వచ్చాయి. జేకే పేపర్ 10%, ఆంధ్రా పేపర్ 16% ప్రాఫిట్స్ నమోదు చేశాయి. నిఫ్టీలో మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 విలువ 0.5% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మాల వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!