Sensex crosses 60,000 mark: గత నాలుగు నెలల్లో తొలిసారిగా 60,000 మార్క్ దాటిన సెన్సెక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sensex crosses 60,000 mark: మన దేశ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 30 రోజులుగా ర్యాలీ కొనసాగుతోంది. గత నాలుగు నెలల్లో తొలిసారిగా ఇవాళ సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటడం ఇదే మొదటిసారి. గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సిగ్నల్స్ నెలకొన్నాయి. ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్ల వైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ చూపు సారిస్తున్నారు. సెన్సెక్స్ మరోసారి 60 వేల మార్క్ దాటడం స్థానిక రిటైల్ ఇన్వెస్టర్ల సామర్థ్యానికి సంకేతమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
టాప్-100లోకి ట్రెంట్
Also Read
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
- Budget 2026: గ్లోబల్ అనిశ్చితుల్లో భారత్ బడ్జెట్పై అంచనాలు.. కీలక రంగాల్లో సంస్కరణలు
మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) పరంగా అత్యంత విలువైన 100 కంపెనీల ఎలైట్ క్లబ్లోకి ఇవాళ ట్రెంట్ ఎంటరైంది. ఈ సంస్థ షేర్ ధర రూ.1,477కి పెరిగింది. ట్రెంట్ ఎం-క్యాప్ తాజాగా రూ.51,912 కోట్లకు చేరింది. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోను దాటే పైకెదిగి ఈ ఘనతను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్ సంస్థ అయిన ఈ ట్రెంట్ ఆధ్వర్యంలోనే వెస్ట్సైడ్ అనే ఫ్యాషన్ రిటైల్ స్టోర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వెస్ట్సైడ్.. ఇండియాలోని లీడింగ్ స్టోర్లలో ఒకటి కావటం గమనార్హం.
TRS Party: వరుస ఎన్నికల నేపథ్యంలో.. సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ
ఎయిర్టెల్ అడ్వాన్స్ పేమెంట్
5జీ స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ కంపెనీ నాలుగేళ్ల ఇన్స్టాల్మెంట్ని ముందుగానే చెల్లించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం(డీఓటీ)కి 8,312.4 కోట్ల రూపాయల పేమెంట్ చేసినట్లు ఇవాళ వెల్లడించింది. ఇటీవలే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొన్న ఈ సంస్థ రూ.43,039.63 కోట్ల విలువైన స్పెక్ట్రం కోసం విజయవంతంగా బిడ్ను దాఖలు చేసింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 317 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 60,159 వద్ద ట్రేడింగ్ అవుతుండటం విశేషం. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17923పైనే కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. ప్రస్తుతం 79.44 వద్ద ఉంది. జయంత్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ షేరు నెల రోజుల్లోనే 219 శాతం పెరిగింది. ప్రారంభ ధర రూ.87.90తో మొదలై ఇవాళ రూ.280.55కి ఎదిగింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..