Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను పోగొట్టుకుంటూ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. అవగాహన లోపం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అంటే అదీ ఒక సీరియస్ బిజినెసే అనుకోవాలి. ఎవరైనా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ముందు దాని గురించి లోతుగా స్టడీ చేస్తారు. లాభనష్టాలను తెలుసుకుంటారు. అన్నింటిపైనా అవగాహన వచ్చాకే ఇన్వెస్ట్ చేస్తారు. దానిపైన లాభాలు వచ్చేవరకు ఓపిక పడతారు. కానీ స్టాక్ మార్కెట్లో అలా కాదు. ఇవాళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, రేపు డబ్బులు వేసి, ఎల్లుండి నుంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటారు. అది తప్పు. అందుకే మనీ లాస్ అవుతున్నారు.
Also Read
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
స్టాక్ మార్కెట్కు సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం, స్కిల్స్ లోపించటం వల్ల కూడా ప్రజలు నష్టాల బారిన పడుతున్నారు. ఏదైనా బిజినెస్ చేయాలంటే అవగాహన తర్వాత అనుభవం సాధించాలి. మెలకువలు నేర్చుకోవాలి. గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అలాగే ఏ పనైనా బేసిక్స్ తెలియకుండా చేస్తే పునాదిలేని ఇల్లు మాదిరిగా కుప్పకూలిపోతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని ‘హ్యాండిల్ విత్ కేర్’ అని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్య విషయం.. డిసిప్లెయిన్ అండ్ సైకాలజీ. వ్యాపారం గురించి అవగాహన, బిజినెస్ చేసిన అనుభవం ఉన్నవాళ్లకు క్రమశిక్షణ, ట్రేడింగ్ సైకాలజీ సైతం ఇంపార్టెంటే.
ఉదాహరణకు.. మనం ఏదైనా షోరూం బిజినెస్ చేస్తున్నామనుకోండి. నా ఇష్టం వచ్చినప్పుడు షోరూం ఓపెన్ చేస్తాను, మిగతా సమయంలో ఇంట్లో ముసుగుపెట్టుకొని పడుకుంటానంటే కుదరదు. టైమింగ్స్ మెయిన్టెయిన్ చేయాలి. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కంపెనీల, షేర్ల పెర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇలాంటి మరిన్ని విలువైన విషయాలను తెలుసుకోవాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఫిన్టాక్ వీడియో చూస్తే సరిపోతుంది. వెల్త్ ట్రీ గ్రూపు ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ఎన్నో కీలకాంశాలను వెల్లడించారు. ఈ ఐటమ్ కిందే ఆ వీడియో క్లిప్పింగ్ ఉంది. పరిశీలించగలరు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!