Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను పోగొట్టుకుంటూ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. అవగాహన లోపం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అంటే అదీ ఒక సీరియస్ బిజినెసే అనుకోవాలి. ఎవరైనా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ముందు దాని గురించి లోతుగా స్టడీ చేస్తారు. లాభనష్టాలను తెలుసుకుంటారు. అన్నింటిపైనా అవగాహన వచ్చాకే ఇన్వెస్ట్ చేస్తారు. దానిపైన లాభాలు వచ్చేవరకు ఓపిక పడతారు. కానీ స్టాక్ మార్కెట్లో అలా కాదు. ఇవాళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, రేపు డబ్బులు వేసి, ఎల్లుండి నుంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటారు. అది తప్పు. అందుకే మనీ లాస్ అవుతున్నారు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
స్టాక్ మార్కెట్కు సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం, స్కిల్స్ లోపించటం వల్ల కూడా ప్రజలు నష్టాల బారిన పడుతున్నారు. ఏదైనా బిజినెస్ చేయాలంటే అవగాహన తర్వాత అనుభవం సాధించాలి. మెలకువలు నేర్చుకోవాలి. గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అలాగే ఏ పనైనా బేసిక్స్ తెలియకుండా చేస్తే పునాదిలేని ఇల్లు మాదిరిగా కుప్పకూలిపోతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని ‘హ్యాండిల్ విత్ కేర్’ అని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్య విషయం.. డిసిప్లెయిన్ అండ్ సైకాలజీ. వ్యాపారం గురించి అవగాహన, బిజినెస్ చేసిన అనుభవం ఉన్నవాళ్లకు క్రమశిక్షణ, ట్రేడింగ్ సైకాలజీ సైతం ఇంపార్టెంటే.
ఉదాహరణకు.. మనం ఏదైనా షోరూం బిజినెస్ చేస్తున్నామనుకోండి. నా ఇష్టం వచ్చినప్పుడు షోరూం ఓపెన్ చేస్తాను, మిగతా సమయంలో ఇంట్లో ముసుగుపెట్టుకొని పడుకుంటానంటే కుదరదు. టైమింగ్స్ మెయిన్టెయిన్ చేయాలి. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కంపెనీల, షేర్ల పెర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇలాంటి మరిన్ని విలువైన విషయాలను తెలుసుకోవాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఫిన్టాక్ వీడియో చూస్తే సరిపోతుంది. వెల్త్ ట్రీ గ్రూపు ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ఎన్నో కీలకాంశాలను వెల్లడించారు. ఈ ఐటమ్ కిందే ఆ వీడియో క్లిప్పింగ్ ఉంది. పరిశీలించగలరు.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!