ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా టీటీడిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం టీటీడి లో డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది.. ఈ జాబ్స్ అర్హతలు,జీతం గురించి మొత్తం వివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య : 78
డిగ్రీ లెక్చరర్లు-49,
జూనియర్ లెక్చరర్లు-29
డిగ్రీ లెక్చరర్లు: సబ్జెక్ట్ల వారీగా ఖాళీలు: బోటనీ-03, కెమిస్ట్రీ-02, కామర్స్-09, డెయిరీ సైన్స్-01, ఎలక్ట్రానిక్స్-01, ఇంగ్లిష్-08, హిందీ-02, హిస్టరీ-01, హోమ్ సైన్స్-04, ఫిజికల్ ఎడ్యుకేషన్-02, ఫిజిక్స్-02, పాపులేషన్ స్టడీస్-01, సంస్కృతం-01, సంస్కృత వ్యాకరణం-01, స్టాటిస్టిక్స్-04, తెలుగు-03, జువాలజీ-04..
అర్హతలు..
కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్ అర్హత సాధించి ఉండాలి.
జూనియర్ లెక్చరర్లు..
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: బోటనీ-04, కెమిస్ట్రీ-04, సివిక్స్-04, కామర్స్-02, ఇంగ్లిష్-01, హిందీ-01, హిస్టరీ-04, మ్యాథమేటిక్స్-02, ఫిజిక్స్-02, తెలుగు-03, జువాలజీ-02.
వయసు…
01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది…
జీతం..
నెలకు డిగ్రీ లెక్చరర్కు రూ.61,960 నుంచి రూ.1,51,370. జూనియర్ లెక్చరర్కు రూ.57,100 నుంచి రూ.1,47,760.
ఎంపిక విధానం..
రాతపరీక్ష(కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం.. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది.. 2024, ఫిబ్రవరి మొదటి వారం.
వెబ్సైట్: https://www.tirumala.org/ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇందులో తెలుసుకోగలరు..