Special Story on Vinayaka: వినాయక.. నిత్య (విద్యార్థులకు) స్ఫూర్తిదాయక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Story on Vinayaka: చదువుకోవాలనే మనసు, అమితాసక్తి ఉండాలే గానీ ప్రతి వ్యక్తి జీవితమూ ఒక విలువైన పుస్తకమే. పుస్తకాన్ని పఠించి మస్తకాన్ని మథిస్తే విజ్ఞానం పుడుతుంది. విఘ్నేశ్వరుడి పుట్టుక, లీలల విశేషాలు దీనికో చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ గణపతి.. సకల కళలకు, శాస్త్రాలకు అధిపతి. ఈ దేవదేవుడు.. బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడు. అందుకే ఈ పార్వతీ పుత్రుడికి ప్రతి క్రతువులో ప్రథమ పూజ చేస్తారు. ఇవాళ ఈ ఏకదంతుడి జన్మదినం. ఉత్సవాలకు ఆరంభం. ఈ ప్రత్యేక, పర్వదిన సందర్భంలో ఆయనకే సొంతమైన, అరుదైన రూపం, తనదైన వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యాంశాలపై విశ్లేషణే ఈ ప్రత్యేక కథనం.

Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
ద్వారపాలకుడిగా ప్రాణం పోసుకున్న గణనాథుడు తల్లి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తాడు. బిడ్డలకు అమ్మే తొలి గురువు అనే ప్రకృతి సత్యాన్ని, సహజ సూత్రాన్ని స్వతహాగా అర్థంచేసుకొని మసలుకుంటాడు. చివరికి తండ్రి పరమేశ్వరుడిని సైతం లోపలికి ప్రవేశించనివ్వడు. తద్వారా తనకు తెలియకుండానే తనలోని అమాయకత్వాన్ని చాటుకుంటాడు. దీనికి శివుడు ఆగ్రహంతో ఆ బాలుడి తలను ఛేదిస్తాడు. తదనంతర పరిణామాల్లో ఆ ఓంకారుడు గజాననుడిగా మారిపోతాడు. అజ్ఞానం ఎంత చేటు చేస్తుందో ఈ అనూహ్య ఘటన వివరిస్తుంది. దీన్నుంచి ప్రతిఒక్కరూ జీవితంలో మర్చిపోలేని పాఠం నేర్చుకోవచ్చు.
ఈ అవనీషుడు, భారీ కాయుడు మూషికం అనే అతి చిన్న వాహనంపైనే ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. తిరుగులేని నాయకత్వ లక్షణాలతో లోకాన్ని ఏలాడు. ఈ నిరంతర ప్రయాణంతో ఆ అద్వైతుడు మానవులకు గొప్ప సందేశమిచ్చాడు. నేల విడిచి సాము చేయకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తమనుతాము మలచుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలని పరోక్షంగా బోధించాడు. పోటీ ప్రపంచంలో గెలవటానికి అరివీర భయంకరంగా కష్టపడాల్సిన పనిలేదని, విజ్ఞతతో వ్యవహరిస్తే చాలని చెప్పాడు. తల్లిదండ్రులే తన ప్రపంచమని చాటడం ద్వారా లాజిక్తో ఆలోచించాలనే సూచన చేశాడు.
‘జై బోలో గణేష్ మహరాజ్కీ..’ అని భక్తులు ఊరికే సరదాగా అనట్లేదు. అందులో ఎంతో లోతైన అర్థం ఉంది. గణ్ అంటే గ్రూపు అని అర్థం. మనిషి సంఘజీవి కాబట్టి నలుగురితో కలిసి నడవటం వల్ల లోకజ్ఞానం పొందొచ్చని నేర్పాడు. ఆడవాళ్లు తిరిగి చెడతారనేది పాత కాలం నాటి మాట కావొచ్చు గానీ మగవాళ్లు మాత్రం తిరగక చెడతారనేది అందరూ ఒప్పుకునేదే. అందువల్ల విద్యార్థి దశ నుంచే బృందంతో కలిసి పనిచేసే మంచి లక్షణాన్ని అలవరచుకోవాలని ఏకదంతుడు ఏకవాక్య తీర్మానంలా తేల్చేశాడు. ఈ క్రమంలో నడత, నడక రాజసంగా, ఆదర్శంగా ఉండాలని, వక్రమార్గంలో సాగకూడదని ఈ వక్రతుండుడు నొక్కి వక్కాణించాడు.
వినాయకుడి శరీరం, ఆకారం విభిన్నంగా, వికటంగా ఉంటుంది. అయినా తొండంతోనే అన్ని పనులు చేసుకుంటాడు. ఆహార పదార్థాల వాసన చూడటం, వాటిని తినటం, నీళ్లు తాగటం, ఒంటి మీద నీళ్లు పోసుకోవటం, తద్వారా శరీరాన్ని శుభ్రపరచుకోవటం.. ఇలా అన్నీ ఒకే ఒక అంగంతో చేసుకుంటాడు. ఇలాంటి సంక్లిష్ట జీవితంలో అష్టకష్టాలనూ అవలీలగా ఈదాడు. సర్వాంగాలూ సక్రమంగా ఉన్న ఎందరో చేయలేని ఎన్నో స్వకార్యాలను, సకార్యాలను దిగ్విజయంగా పూర్తిచేసి చూపాడు. జ్ఞాన శక్తికి, కర్మ శక్తికి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని ఆచరణలో పెట్టిచూపాడు.
తల్లి చేతుల్లో రూపం సంతరించుకొని, తండ్రి చేతుల్లో, తండ్రి రూపంలో విధి వక్రీకరించినా తల్లడిల్లకుండా, వెరవకుండా నిత్య జీవిత ఆటంకాలను నిర్భయంగా పటాపంచలు చేశాడు. గజేంద్రుడంటే అధికారానికి, బలానికి, ధైర్య సాహసాలకు చిహ్నంగా నిలిచాడు. ప్రతికూల పరిస్థితులను, మంచీ చెడులను అన్నింటినీ మనలోనే నింపుకొని, దిగమింగుకొని, పరోపకారిగా జీవించాలంటూ ఈ లంబోదరుడు సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించాడు. ఓ చెయ్యితో అభయమిచ్చాడు. మరో చేతితో ఆధ్యాత్మిక తోవ చూపాడు. ఏక దంతంతో ఏక దృష్టికి సంకేతంగా మారాడు. లక్ష్య సాధనపైనే ఫోకస్ పెట్టాలని ఉద్భోదించాడు.

గణేశుడిలోని ఈశ అంటే యజమాని అని అర్థం. దురాలోచనలు, అత్యాశలపై నియంత్రణ, ఆధిపత్యం ద్వారా ప్రోది చేసుకున్న ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా విజయాలు సాధించొచ్చనే భావనను వినాయకచతుర్థి పండుగ మది నిండుగా నింపుతోంది. మన చుట్టూ ఉండే అతిపెద్ద ప్రతిబంధకాలను చాకచక్యంగా ఎలా విచ్ఛిన్నం చేయొచ్చో విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను చూసి కూడా నేర్చుకోవచ్చు. పదాలు కాలక్రమేణా మారతాయి కాబట్టి రుషులు వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా చిహ్నాల రూపంలో ఇలాంటి మెసేజ్లను భావితరాలకు అందించారు. వాటిని కృషితో పాటిస్తే మనుషులు కూడా రుషులవుతారని తెలిపారు. ఇదే ఈ వినాయకచవితి శుభదినం నిత్య విద్యార్థులకు పంచుతున్న విజ్ఞానం. స్ఫూర్తిదాయకం. అనుసరణీయం.
తాజావార్తలు
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!