Live-In Partner: లివ్-ఇన్ పార్ట్నర్ని సోదరుడి సాయంతో చంపేసిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-In Partner: ఇటీవల కాలంలో సహజీవనాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఢిల్లీలో గతేడాది శ్రద్ధావాకర్ హత్య యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. దీని తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వారు హత్యలకు గురయ్యారు. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో మహిళలు చాలా వరకు బాధితులుగా ఉన్నారు. అయితే, గురుగ్రామ్లో మరో లివ్-ఇన్ హత్య చోటు చేసుకుంది. ఈ సారి మాత్రం బాధితులు ఓ యువకుడు. సోదరుడి సహాయంలో ఓ యువతి తన లివ్ ఇన్ పార్ట్నర్ని చంపేసింది.
తన జీవిత భాగస్వామిని తలపై, మెడపై పాన్తో కొట్టి కిరాతంగా హత్య చేసింది. ఈ కేసులో మహిళను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సదరు మహిళ తన సోదరుడు సాయంతో తిక్రీ గ్రామంలో హత్య చేసిందని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ అశోక్ విహార్లో నివాసం ఉంటున్న నీతు అలియాస్ నిష్(34), విక్కీ(28) గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సదరు మహిళకు వివాహమై భర్త నుంచి విడిపోయిందని, ఆమెకు 15 ఏళ్ల పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే సిరిసంపదలతో తులతూగుతుంది..
ఈ కేసులో సిటీ కోర్టు నీతూకి ఒక రోజు కస్టడీ విధించింది. మహిళ సోదరుడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి కచ్చి కాలనీలోని ఓ ఇంట్లో విక్కీ శవమై కనిపించాడు. వీక్కీని ఎవరో హత్య చేశారని అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. శనివారం సదర్ పోలీస్ స్టేషన్లో 302 (హత్య) మరియు 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇన్స్పెక్టర్ అర్జున్ దేవ్ నేతృత్వంలోని పోలీసు బృందం కేసును ఛేదించి ఆదివారం ఘటా గ్రామానికి చెందిన నీతును అరెస్టు చేసింది. ఆమె నుంచి విక్కీ మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి నీతూ, ఆమె సోదరుడు విక్కీ గదికి చేరుకున్నాడని, ఆమె సోదరుడు విక్కీ కలిసి మద్యం సేవించారని, ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగిందని నిందితురాలు నీతూ వెల్లడించింది. ఇంతలో నీతూ విక్కీపై దాడికి పాల్పడింది. విక్కీ మెడ, తలపై గట్టి కొట్టడంతో అతను మరణించాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు నీతూ, విక్కీ మొబైల్తో పారిపోయింది.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!