Woman Cheated With Fake Visas: రాజన్న సిరిసిల్లాలో కి‘లేడీ’.. నకిలీ వీసాలతో భారీ మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Cheated With Fake Visas In Rajanna Siricilla: గల్ఫ్ కంట్రీస్లో ఏదో ఒక చిన్న పని చేసుకుంటే, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని ఎందరో భావిస్తుంటారు. రెండు, మూడేళ్లు కష్టపడితే.. తమ సమస్యలు దూరమవ్వడంతో పాటు ఆ తర్వాతి జీవితాన్ని సుఖంగా గడపొచ్చని ఆశిస్తున్నారు. వారి ఆశనే కొందరు క్యాష్ చేసుకుంటూ.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఆయా దేశాలకు పంపిస్తామని చెప్పి, లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. తీరా సమయం వచ్చాక, కంటికి కనిపించకుండా మాయమవుతారు. తాజాగా ఓ లేడీ కిలాడి కూడా ఇలాంటి మోసాలకే పాల్పడింది. గల్ఫ్ కంట్రీస్కి పంపిస్తానని అమాయకపు బాధితుల్ని నమ్మించి, భారీ డబ్బు దోచేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
రాజన్న సిరిసిల్లాలోని వేములవాడ పట్టణంలో ఒక లేడీ ఏజెంట్ నకిలీ వీసాల ఆఫీస్ నిర్వహించింది. తక్కువ ఖర్చులతోనే మలేషియాతో పాటు ఇతర గల్ఫ్ కంట్రీస్కి పంపిస్తానని నమ్మించింది. అక్కడ మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని, వేతనాలు కూడా ఎక్కువగా అందుతాయని నమ్మబలికింది. దీంతో.. సిద్ధిపేట, ఆర్మూర్, నిజామాబాద్లకు చెందిన కొందరు వ్యక్తులు ఆమెని సంప్రదించారు. ఆ కిలేడీ మాటలు నమ్మి లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. జనాలను నమ్మించడం కోసం.. కొందరికి మలేషియా నకిలీ వీసాలు, మరికొందరికి టూరిజం వీసాలు ఇచ్చింది. ఇంకొందరికేమో.. ఇంకా టైం పడుతుందని, కొన్నాళ్లు వేచి ఉండాలని సర్దిచెప్తూ వచ్చింది. రోజులు గడుస్తున్నా.. వారిని పంపించకుండా, ఏదో ఒక అబద్ధం చెప్తూ వచ్చింది.
Also Read
- Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
ఫైనల్గా ఒక రోజు ఆ మహిళ ఏజెంట్ తమని మోసం చేస్తోందన్న విషయం జనాలకు తెలిసిపోయింది. టూరిజం వీసా, నకిలీ వీసాల వ్యవహారం బయటపడింది. తన బండారం బయటపడటంతో.. గుట్టుచప్పుడు కాకుండా ఆ కిలేడీ లక్షల డబ్బులు తీసుకొని ఉడాయించింది. మరోవైపు.. తాము మోసపోయామంటూ జనాలు మొరపెట్టుకుంటున్నారు. పరారైన ఆ మహిళను వెంటనే అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ డబ్బులు తమకు వెనక్కు ఇప్పించేలా న్యాయం చేయాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!