Delhi Crime: కాబోయే వాడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన మహిళ..
- ఆస్తి కోసం కన్నకూతురు దారుణం..
- రాబోయే భర్తతో కలిసి తల్లి హత్య..
- నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి తెగబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో, మరో స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద నాటకానికి తెరతీసింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కన్న కూతురే నిందితురాలిగా తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే.. నైరుతి ఢిల్లీలోని నజాఫ్గఢ్ ప్రాంతంలో ఈ హత్య చోటు చేసుకుంది. కాబోయే భర్త, కామన్ ఫ్రెండ్స్తో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను మోనికా, ఆమెకు కాబోయే భర్త నరేలా నివాసి అయిన నవీన్ కుమార్, హర్యానాకు చెందిన నవీన్ కుమార్ స్నేహితుడు యోగిష్ అలియస్ యోగిగా గుర్తించారు.
Also Read
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
Read Also: Kolkata Doctor Case: ఇంత అర్జెంట్ ఎందుకు..? ఆర్జీ కర్ ఆస్పత్రి పనులపై హైకోర్టు ప్రశ్న..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మహిళా కాలర్ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి, ఇంట్లో ఉన్న తన తల్లి స్పందించడం లేదని, పోలీసులు వెళ్లి తలుపు తీసి చూడాలని కోరింది. నజాఫ్గఢ్ మెయిన్ మార్కెట్లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో తన 58 ఏళ్ల తల్లి ఒంటరిగా నివసిస్తుందని మోనికా సోలంకిగా అనే మహిళ కాల్ చేసి చెప్పింది. ఒక రోజు ముందే ఆమె దగ్గరకు వెళ్లినట్లు , ఆమె బాగానే ఉందని చెప్పింది.
పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా లోపల బెడ్రూంలో నేలపై సుమిత్ర అనే మహిళ నుదిటిపై, కంటిపై, రెండు చేతులపై గాయాలతో విగతజీవిగా పడిఉంది. ఆమె నోటి వెంట రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. వెంటనే విచారించిన పోలీసులు భవనంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఒక మహిళలో పాటు మరో ఇద్దరు తెల్లవారుజామున 2.18 గంటల సమయంలో ఫ్లాట్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. ఫుటేజీని స్పష్టంగా పరిశీలించగా ఫ్లాట్లోకి వెళ్తున్న వారిని హత్య చేయబడిన సుమిత్ర కుమార్తె మోనికాగా మరో ఇద్దర్ని నవీన్, యోగేష్గా గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
- Tags
- crime
- Crime News
- Delhi
- delhi crime
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!