Crime News: మరో ఘటన.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- అనంతపురం నగర సమీపంలో ఘటన..
- ఆరు గంటల్లోపు నిందితులను పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఈ మధ్య ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు.. వరుస ఘటనలతో.. అసలు పెళ్లి చేసుకోవాలంటేనే వణుకిపోతున్నామంటూ.. కొందరు యువత సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. అనుమానం ఉన్న మరికొందరు కూడా.. భయంతో వణికిపోతున్నారట.. అయితే, ఆంధ్రప్రదేశ్లో మరో ఘటన వెలుగు చూసింది.. అనంతపురం నగర సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం రాచనాపల్లి సమీపంలో కుమ్మర సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యాడు.. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సురేష్ బాబు భార్య అనితను, ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: V Hanumantha Rao: భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..
Also Read
- Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు డీఎస్పీ వెంకటేశులు.. కళ్యాణదుర్గం రోడ్ లో సురేష్ బాబు, అనిత హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్ అనే ఒక పండ్లు అమ్ముకునే వ్యక్తి పరిచమయ్యాడు. అది వివాహేతర సంబంధం గా మారింది. ఈ విషయంలో సురేష్ బాబుకు అనుమానం రావడంతో మద్యం సేవించి అనితను వేధించసాగాడు. తమ సంబంధానికి భర్త సురేష్ బాబు అడ్డుగా ఉన్నాడని ఫక్రుద్దీన్ తో అని చెప్పింది. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండవచ్చని హత్యకు ఉసిగొల్పింది.. దీంతో ఫక్రుద్దీన్ గత రాత్రి సురేష్ బాబు హోటల్ మూసివేసి.. ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఖాళీ సీసాతో విసిరి దాడి చేశాడు. వెంటనే కింద పడ్డ సురేష్ బాబుని స్క్రూ డ్రైవర్ తో పొడిచే ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశాడు. అనంతపురం పరిధిలో రెండు రోజుల్లో వరుసగా రెండు హత్యలు జరగడంతో ఈ కేసును ఎస్పీ జగదీష్ బాబు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి వెంకటేశులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోని ఈ హత్య జరిగిందని ఆయన వెల్లడించారు…
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?