Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finance Scam: హైదరాబాద్ బంజారాహిల్స్ కి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజా, అతని కుమారుడు ఆశిష్ కుమార్ ఓజా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫైనాన్స్ కి కోట్ల రూపాయలు ఇస్తూ వారి భూములను కాజేస్తున్నారు. సునీల్ కుమార్ ఓజా మొదట ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాడు.. అందుకు షూరిటీగా వారికి సంబంధించిన భూమి ఫ్లాట్స్ జిపిఏ లేదా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇక గడువు అనంతరం ఫైనాన్స్ తీసుకున్నవారు అసలు ఇంట్రెస్ట్ కలిపి చెల్లించిన కొంతమంది రెట్టింపు డబ్బులు చెల్లించినా కూడా తమ భూములను తిరిగి ఇవ్వడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. ఈ ఫైనాన్సర్లు వేధింపులకు తాళలేక ఇప్పటికే అనేకమంది దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.
Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
మొకిలాకు చెందిన షేక్ ఫరీద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజ వద్ద సుమారు 16 కోట్లు అప్పు తీసుకున్నాడు. అందుకుగాను షూరిటీగా తన వద్ద ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేశాడు. గడువు ముగిసిన అనంతరం ఇంట్రెస్ట్ తో కలిపి 20 కోట్లకు పైగా చెల్లించాడు. కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్న తన భూములను తిరిగి ఇవ్వలేదు. రెండేళ్లుగా తమ భూములు ఇవ్వాలంటూ అడుగుతున్నప్పటికీ తిరిగి తమనే బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ బాధితులు వాపోతున్నారు. వారి వద్ద ఉన్న రివాల్వర్ తో అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధితుడు విన్నవించుకున్నారు.
ఇదే తరహాలో గుండ్ల పోచంపల్లికి చెందిన రఘునందన్ రెడ్డి అనే బాధితుడు కూడా సునీల్ కుమార్ చేతిలో మోసపోయాడు. వారి వద్ద రెండు కోట్లు అప్పు తీసుకుంటే అవి చెల్లించినా కూడా నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫైనాన్స్ వల్ల ఆగడాలకు అడ్డు అదుపు లేదు. భారతి బిల్డర్స్ కూడా సునీల్ కుమార్ బాధితులే అని సమాచారం. ఇలా వందలాదిమంది ఫ్లాట్ ఓనర్స్ సునీల్ కుమార్ చేతిలో మోసపోయారు. గతంలో ఈ ఫైనాన్సర్ సునీల్ కుమార్ పై అనేక మోసం చేసిన కేసులు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వందలాది మంది బాధితులను మోసం చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ఫైనాన్సర్ లపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!