Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య
- చిన్న చిన్న విషయాలకే హత్యలు
- బీడీ కాల్చాడని ఇటుక, కర్రతో దాడి
- తల, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో భర్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు చేస్తున్నారు. దీంతో కొందరు యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం బీడీ తాగాడని కోపంతో భర్తపై ఇటుకలు, కర్రలతో దాడి చేసి హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అతడు చనిపోయిన తర్వాత కూడా తనలో కోపం తగ్గకపోవడంతో అతడి శరీరంపై తన్నడం, కొట్టడం వంటివి చేసింది.
Read Also: Bigg Boss : అనారోగ్య సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..
Also Read
- Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
హర్యానాలోని మహముపూర్ గ్రామానికి చెందిన సురేష్ (60), తన భార్య పూనమ్తో కలిసి గర్హి సారాయ్ నామ్దార్ ఖాన్ గ్రామంలోని ఒక ఇంట్లో సంవత్సరం నుంచి నివసిస్తున్నాడు. చాలా కాలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే.. ఆదివారం రాత్రి కూడా వారు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం సురేష్ బీడీ తాగుతున్నాడు. ఇది గమనించిన భార్య పూనమ్ అతడి దగ్గరి నుంచి బీడీ లాక్కుంది. దీంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో కోపంతో పూనమ్ సురేష్ పై దగ్గర్లో ఉన్న ఇటుక, కర్రతో దాడి చేసింది. తల, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో సురేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన తర్వాత కూడా పూనమ్ కోపం తగ్గలేదు. మంచం మీద కూర్చుని.. తన భర్త శరీరాన్ని పదే పదే తన్నడం, కొట్టడం చేసింది.
Read Also:Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్
ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. సురేష్ బంధువు రాజేష్ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు పూనమ్పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలైన పూనమ్ ఎటువంటి సమాధానం చెప్పకుండా.. మౌనంగా ఉంటుందని.. పోలీసులు వెల్లడించారు. పూనమ్ కు ఇద్దరు కూమార్తెలు .. ఒక కుమార్తెకు వివాహం కాగా, మరొక కుమార్తె తన అత్తతో నివసిస్తోంది.
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!