Visakha Constable Case: సంచలనం రేపుతున్న విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్యకేసులో పోలీసులకు కీలక వీడియోలు దొరికాయి. ఇందులో రమేష్ భార్య శివానీ( శివజ్యోతి ) తెలివితేటలు చూసి షాకయ్యారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ముందు పెద్ద ప్లాన్ చేసింది. రమేష్ను హత్య చేసే ముందు ఎవరికీ డౌట్ రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు వీడియోలు రికార్డు చేసింది. భర్తకు మటన్ కూడా వండిపెట్టి, మద్యం తాగించి.. నా భార్య మంచిదని ఆ వీడియోలో చెప్పించింది. ఇక, రమేష్ మత్తులో పడిపోతుంటే మంచంపై పడుకోబెట్టిన వీడియోలను కూడా రికార్డు చేసింది. ఆ తర్వాత నిద్రపోతుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అందరికి గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పింది. రమేశ్ చనిపోయిన తర్వాత ఎవరికి డౌట్ రాకుండా ముందుగానే వీడియోలు తీసిపెట్టుకున్నట్టు శివానీ పోలీసుల ముందు ఒప్పుకుంది. దీంతో ఆమె తెలివితేటలు చూసిన పోలీసులు కంగుతున్నారు.
Read Also: Test Match: ఈ ఏడాది టెస్టు మ్యాచ్ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన టీమిండియా క్రికెటర్లు వీళ్లే..!
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
విశాఖ వన్టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్కుమార్ భార్య శివాని ( శివజ్యోతి )తో కలిసి ఎంవీపీ కాలనీలో ఉంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందాడంటూ భార్య ఎంవీపీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేశారు. తాము అన్యోన్యంగానే ఉంటున్నామని ఆమె కొన్ని వీడియోలను పోలీసులకు చూపించింది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఊపిరాడక పోవడం వల్ల మృతి చెందినట్లు తేలింది. తమదైన శైలిలో పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
Read Also: Santosh Sobhan: డైరెక్టర్ అవుతాడని అనుకోలే.. కానీ ఇప్పుడు ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకం
రమేష్ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివానీ ప్లాన్ చేసింది. ఆమె తన దగ్గరున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఒకటో తేదీ రాత్రి రమేష్ ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోయాడు. అనంతరం నీలాను పిలిచారు.. ఇక రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా పట్టుకోగా, కదలకుండా శివానీ కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. రామారావు ఇంటి బయట ఎవరూ రాకుండా చూశాడు. అయితే, ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివానీ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం గమనించిన రమేష్.. ఓసారి రామారావుతో గొడవ పెట్టుకున్నట్లు ఒప్పుకున్నారు.
Read Also: Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్ల జీతాలను పెంచిన పీసీబీ..
అనంతరం రామారావు, శివానీ (శివజ్యోతి) కొన్ని రోజులు బయటకు వెళ్లిపోయారు. ఇరు వర్గాల కుటుంబీకులు రమేష్కు నచ్చజెప్పి శివానీని ఇంటికి తీసుకొచ్చారు. అయినా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతునే ఉన్నాయి. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివానీని రమేష్ మండిపడేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూగా గొడవ జరుగుతుండేది. భర్తను హత్య చేసి దాన్ని సాధారణ మృతిగా చిత్రీకరించి ఉద్యోగం ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు పొందాలని శివానీ చూసింది. డబ్బుతో పాటు ఉద్యోగం కూడా వస్తుందని ఆమె అనుకుంది. అనంతరం రామారావుతో కలిసి ఉండాలనుకుంది. హత్యాకేసులో ఏ1గా శివానీ(శివజ్యోతి), ఏ2గా రామారావు, ఏ3గా నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాగా వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
Mega 158: డాడీ కోసం పెద్ది!
-
PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
-
Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
-
CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
-
Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!