Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Visakha Constable Rameshs Murder Case Is Causing Sensation

Visakha Constable Case: సంచలనం రేపుతున్న విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు

Published Date :August 5, 2023 , 8:29 pm
By NTV WebDesk
Visakha Constable Case: సంచలనం రేపుతున్న విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు
  • Follow Us :
  • google news
  • dailyhunt

విశాఖపట్నంలో కానిస్టేబుల్‌ రమేష్‌ హత్యకేసులో పోలీసులకు కీలక వీడియోలు దొరికాయి. ఇందులో రమేష్‌ భార్య శివానీ( శివజ్యోతి ) తెలివితేటలు చూసి షాకయ్యారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ముందు పెద్ద ప్లాన్ చేసింది. రమేష్‌ను హత్య చేసే ముందు ఎవరికీ డౌట్ రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు వీడియోలు రికార్డు చేసింది. భర్తకు మటన్‌ కూడా వండిపెట్టి, మద్యం తాగించి.. నా భార్య మంచిదని ఆ వీడియోలో చెప్పించింది. ఇక, రమేష్‌ మత్తులో పడిపోతుంటే మంచంపై పడుకోబెట్టిన వీడియోలను కూడా రికార్డు చేసింది. ఆ తర్వాత నిద్రపోతుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అందరికి గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పింది. రమేశ్‌ చనిపోయిన తర్వాత ఎవరికి డౌట్ రాకుండా ముందుగానే వీడియోలు తీసిపెట్టుకున్నట్టు శివానీ పోలీసుల ముందు ఒప్పుకుంది. దీంతో ఆమె తెలివితేటలు చూసిన పోలీసులు కంగుతున్నారు.

Read Also: Test Match: ఈ ఏడాది టెస్టు మ్యాచ్‌ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన టీమిండియా క్రికెటర్లు వీళ్లే..!

విశాఖ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌కుమార్‌ భార్య శివాని ( శివజ్యోతి )తో కలిసి ఎంవీపీ కాలనీలో ఉంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్‌ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందాడంటూ భార్య ఎంవీపీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేశారు. తాము అన్యోన్యంగానే ఉంటున్నామని ఆమె కొన్ని వీడియోలను పోలీసులకు చూపించింది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఊపిరాడక పోవడం వల్ల మృతి చెందినట్లు తేలింది. తమదైన శైలిలో పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.

Read Also: Santosh Sobhan: డైరెక్ట‌ర్ అవుతాడ‌ని అనుకోలే.. కానీ ఇప్పుడు ఓ బ్రాండ్ అవుతాడ‌ని న‌మ్మ‌కం

రమేష్‌ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివానీ ప్లాన్ చేసింది. ఆమె తన దగ్గరున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. వెల్డింగ్‌ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఒకటో తేదీ రాత్రి రమేష్‌ ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోయాడు. అనంతరం నీలాను పిలిచారు.. ఇక రమేష్‌ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా పట్టుకోగా, కదలకుండా శివానీ కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. రామారావు ఇంటి బయట ఎవరూ రాకుండా చూశాడు. అయితే, ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివానీ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం గమనించిన రమేష్‌.. ఓసారి రామారావుతో గొడవ పెట్టుకున్నట్లు ఒప్పుకున్నారు.

Read Also: Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్ల జీతాలను పెంచిన పీసీబీ..

అనంతరం రామారావు, శివానీ (శివజ్యోతి) కొన్ని రోజులు బయటకు వెళ్లిపోయారు. ఇరు వర్గాల కుటుంబీకులు రమేష్‌కు నచ్చజెప్పి శివానీని ఇంటికి తీసుకొచ్చారు. అయినా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతునే ఉన్నాయి. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివానీని రమేష్‌ మండిపడేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూగా గొడవ జరుగుతుండేది. భర్తను హత్య చేసి దాన్ని సాధారణ మృతిగా చిత్రీకరించి ఉద్యోగం ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు పొందాలని శివానీ చూసింది. డబ్బుతో పాటు ఉద్యోగం కూడా వస్తుందని ఆమె అనుకుంది. అనంతరం రామారావుతో కలిసి ఉండాలనుకుంది. హత్యాకేసులో ఏ1గా శివానీ(శివజ్యోతి), ఏ2గా రామారావు, ఏ3గా నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాగా వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • constablecase
  • constableramesh
  • murder case
  • Ramesh
  • vishakha

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions