Uttar Pradesh: తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దొంగలు..
Uttar Pradesh: ముగ్గురు వ్యక్తులు తన భార్య, 14 ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో ఈ ఘటన జరిగింది. సైఫ్నిలోని వారి ఇంటిలో నుంచి దొంగలు నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వ్యక్తి చేసిన ఆరోపణలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సదరు వ్యక్తి తన ఇంటి నుంచి రూ. 5000 నగదుతో పాటు మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత మళ్లీ కొద్ది సేపటికి వచ్చి తన భార్యతో పాటు కూతురుపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
ఈ ఘటనపై సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రిముగ్గురు వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి, తనను కట్టేసి, మొబైల్, రూ. 5000 తీసుకున్నాడని, తర్వాత తన భార్య, కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్లా మాట్లాడుతూ.. ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, తల్లీకూతుళ్లను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు.
నిందితుల్లో ఒకరిని కైఫ్ గా గుర్తించారు. అతడిని విచారిస్తున్నామని, కొద్ది రోజుల క్రితం కైఫ్ కు ఫిర్యాదుదారుడితో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ ఘటన రాష్ట్రాన్ని భయాందోళనకు గురిచేసిందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇది అధికార బీజేపీ వైఫల్యమే అని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!