UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం
- మరో వివాహితతో మాజీ సర్పంచ్ అక్రమ సంబంధం
- హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా.. ఉత్తరప్రదేశ్లోని సుమేర్పూర్ గ్రామ మాజీ సర్పంచ్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కిస్మతుల్ నిషాకు తొమ్మిది మంది పిల్లలు ఉండగా.. రెండో భార్య అంబియా బానోకు కూడా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. మొత్తంగా 18 మంది పిల్లలున్నారు. అయితే గ్రామ సర్పంచ్గా పని చేసిన మున్నా బుద్ధి మాత్రం మంచిగా లేదు. ఇద్దరు భార్యలుండి.. 18 మంది పిల్లలుండి కూడా వంకర బుద్ధి చూపించాడు.
గ్రామంలో ఉన్న సుమన్ దేవి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమన్ దేవి భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదే అదునుగా ఆమెకు సాయం పేరుతో దగ్గరయ్యాడు. పదే పదే కలవాలంటూ ఒత్తిడి తేవడం.. అక్కడితో ఆగకుండా బ్లాక్మెయిల్కు దిగాడు. ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో తన సోదరుడితో కలిసి మున్నా హత్యకు ప్రణాళిక రచించింది. ప్లాన్లో భాగంగా మార్చి 18న తన పుట్టింటికి సుమన్ దేవి ఆహ్వానించింది. దీంతో మున్నా గదిలోకి రాగానే సోదరుడు, అతడి అనుచరులు కలిసి రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి కాలువలో పడేశారు.
అయితే మున్నా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో దిగారు. మున్నా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి బైక్ వేరే చోట గుర్తించారు. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్స్ ప్రకారం నిందితురాలను గుర్తించారు. విచారించగా తన సోదరుడితో కలిసి హత్య చేసినట్లుగా సుమన్ దేవి ఒప్పుకుంది. అనంతరం మార్చి 22 (ఆదివారం)న కాలువ దగ్గర మున్నా మృతదేహాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
మున్నాకు ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్నారని.. ఒక కుమార్తెకు వివాహం కూడా జరిపించాడని పోలీసులు తెలిపారు. మరోసారి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలని సిద్ధపడుతున్నాడని.. ఈ క్రమంలో సుమన్ దేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. పదే పదే బెదిరించడంతో ప్రియురాలు చంపేసిందని వెల్లడించారు. అయితే మున్నా చనిపోవడంతో ఇద్దరు భార్యలు, పిల్లలు తీవ్ర విషాదంతో కన్నీరు మున్నీరయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?