UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం
- మరో వివాహితతో మాజీ సర్పంచ్ అక్రమ సంబంధం
- హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

Also Read
- Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
- China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా.. ఉత్తరప్రదేశ్లోని సుమేర్పూర్ గ్రామ మాజీ సర్పంచ్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కిస్మతుల్ నిషాకు తొమ్మిది మంది పిల్లలు ఉండగా.. రెండో భార్య అంబియా బానోకు కూడా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. మొత్తంగా 18 మంది పిల్లలున్నారు. అయితే గ్రామ సర్పంచ్గా పని చేసిన మున్నా బుద్ధి మాత్రం మంచిగా లేదు. ఇద్దరు భార్యలుండి.. 18 మంది పిల్లలుండి కూడా వంకర బుద్ధి చూపించాడు.
గ్రామంలో ఉన్న సుమన్ దేవి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమన్ దేవి భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదే అదునుగా ఆమెకు సాయం పేరుతో దగ్గరయ్యాడు. పదే పదే కలవాలంటూ ఒత్తిడి తేవడం.. అక్కడితో ఆగకుండా బ్లాక్మెయిల్కు దిగాడు. ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో తన సోదరుడితో కలిసి మున్నా హత్యకు ప్రణాళిక రచించింది. ప్లాన్లో భాగంగా మార్చి 18న తన పుట్టింటికి సుమన్ దేవి ఆహ్వానించింది. దీంతో మున్నా గదిలోకి రాగానే సోదరుడు, అతడి అనుచరులు కలిసి రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి కాలువలో పడేశారు.
అయితే మున్నా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో దిగారు. మున్నా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి బైక్ వేరే చోట గుర్తించారు. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్స్ ప్రకారం నిందితురాలను గుర్తించారు. విచారించగా తన సోదరుడితో కలిసి హత్య చేసినట్లుగా సుమన్ దేవి ఒప్పుకుంది. అనంతరం మార్చి 22 (ఆదివారం)న కాలువ దగ్గర మున్నా మృతదేహాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
మున్నాకు ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్నారని.. ఒక కుమార్తెకు వివాహం కూడా జరిపించాడని పోలీసులు తెలిపారు. మరోసారి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలని సిద్ధపడుతున్నాడని.. ఈ క్రమంలో సుమన్ దేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. పదే పదే బెదిరించడంతో ప్రియురాలు చంపేసిందని వెల్లడించారు. అయితే మున్నా చనిపోవడంతో ఇద్దరు భార్యలు, పిల్లలు తీవ్ర విషాదంతో కన్నీరు మున్నీరయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!