Umrah Scam: కర్నూలు జిల్లాలో ఉమ్ర యాత్ర పేరుతో 4 కోట్ల రూపాయలు మోసం చేశాడు ఒక కేటుగాడు. హైదరాబాద్ పాత బస్తికి చెందిన వ్యక్తి ఉమ్ర యాత్రకు పంపిస్తానని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 40,000లు దాదాపు 1000 మంది నుంచి వసూలు చేశాడు. ఈ కేటుగాడు బాధితుల్లో కర్నూలు జిల్లాలోని కర్నూల్, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
డబ్బులు తీసుకొని ముఖం చాటేయడంతో బాధితులు అతన్ని పట్టుకొని కర్నూలు పోలీసులకు అప్పగించారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా.. రెండు కోట్లు బాధితులకు ఇచ్చినట్టుగా తెలిపాడు నిందుతుడు. దీనితో అసలు ఈ మోసానికి ఎలా పాల్పడ్డారు..? మొత్తం ఎంత మంది మోసపోయారు..? ఎన్ని కోట్లు కొల్లగొట్టాడని పోలీసులు వారి స్టైల్ లో విచారణను మొదలు పెట్టారు.
