LIC New Jeevan Anand: చనిపోయే వరకు తోడుండే పాలసీ.. రూ.45 తో రూ.25 లక్షల రిటర్న్స్తో పాటు లైఫ్ టైమ్ ఫ్రీ కవరేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC New Jeevan Anand: సామాన్యుల ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తున్న “న్యూ జీవన్ ఆనంద్” (ప్లాన్ నెం. 915) పాలసీ ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలంలో భారీ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఐసీ అందిస్తున్న ఈ ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్ను కొడుతున్న ఇరాన్…
Also Read
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
చిన్న మొత్తంతో పెద్ద నిధి..
చాలా మంది భారీ లాభాల కోసం నెలకు వేలల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. కానీ, ఈ ప్లాన్ ఆ ఆలోచనను మారుస్తోంది. 35 ఏళ్ల వ్యక్తి, ర.5 లక్షల హామీ మొత్తంతో (Sum Assured) 35 ఏళ్ల కాలపరిమితికి ఈ పాలసీని తీసుకుంటే.. వార్షిక ప్రీమియం సుమారు రూ.16,300 మాత్రమే. ఈ మొత్తాన్ని రోజువారీగా లెక్కిస్తే కేవలం రూ.45 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ గడువు ముగిసే సమయానికి (35 ఏళ్ల తర్వాత), ప్రస్తుత బోనస్ రేట్ల ప్రకారం పాలసీదారుడు ఏకంగా రూ.25 లక్షల భారీ మొత్తాన్ని అందుకుంటారు. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, రివిజనరీ బోనస్ రూ.8.60 లక్షలు, ఫైనల్ అడిషనల్ బోనస్ రూ.11.50 లక్షలు కలిసి ఉంటాయి.
మెచ్యూరిటీ తర్వాత కూడా ‘లైఫ్ రిస్క్ కవర్’
సాధారణ బీమా పాలసీలకు, జీవన్ ఆనంద్కు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. సాధారణంగా మెచ్యూరిటీ డబ్బులు రాగానే బీమా రక్షణ ముగిసిపోతుంది. కానీ, ఈ ప్లాన్లో రూ.25 లక్షల మెచ్యూరిటీ అమౌంట్ అందుకున్న తర్వాత కూడా, పాలసీదారుని జీవితాంతం రూ.5 లక్షల ఉచిత బీమా కొనసాగుతుంది. అంటే భవిష్యత్తులో పాలసీదారుడు ఎప్పుడు మరణించినా, వారి కుటుంబానికి అదనంగా మరో రూ.5 లక్షలు అందుతాయి. ఈ పాలసీ కేవలం పొదుపు మాత్రమే కాదని, పన్ను ఆదాకు కూడా మార్గం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్లో భాగంగా చెల్లించే ప్రీమియంలపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. మెచ్యూరిటీ ద్వారా వచ్చే మొత్తం పూర్తిగా పన్ను రహితం. పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత అత్యవసర అవసరాల కోసం లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ ప్లాన్ పొందవచ్చు. 15 నుంచి 35 సంవత్సరాల వరకు తమకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అదనపు రక్షణ కోసం యాక్సిడెంటల్ డెత్ లేదా క్రిటికల్ ఇల్నెస్ వంటి రైడర్లను కూడా జోడించుకోవచ్చు.
READ ALSO: IPL 2026: అస్త్రశస్త్రాలతో సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?
తాజావార్తలు
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!