Jogipeta Teacher Robbed: ‘గురువు గారూ’ అంటూ నిండా దోచేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Young Boys Robbed Retired Teacher in Jogipeta: ‘గురువు గారూ గురువు గారూ’ అంటూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడ్ని నిండా దోచేశారు ఇద్దరు యువకులు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపి, ఇంట్లో నుంచి రూ. 30 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని దొంగలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ నారాయణ అనే రిటైర్డ్ టీచర్ ఎస్సీ బాలుర హాస్టల్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నారు. రెండు నెలల క్రితం మార్కెట్ యార్డ్ ఆవరణలో మద్యం సేవిస్తుండగా.. ఇద్దరు యువకులు ఆయన వద్దకు వచ్చారు. ‘గురువు గారు, బాగున్నారా? మమ్మల్ని గుర్తు పట్టారా? మేము మీ విద్యార్థులమే’నని మాట కలిపారు. ఆప్యాయంగా పలకరించడంతో.. ఆయన తన విద్యార్థులేమోనని అనుకున్నారు. ఆ తర్వాత కొన్నిసార్లు కలుసుకోవడం, మద్యం కూడా సేవించడంతో.. వారి మధ్య చనువు ఏర్పడింది.
కట్ చేస్తే.. ఈనెల 24న ఆ రిటైర్డ్ టీచర్ ఎప్పట్లాగే మార్కెట్ యార్డ్ వద్ద మద్యం సేవించేందుకు బయలుదేరారు. అయితే, అక్కడ దోమలున్నాయని చెప్పి ఆ యువకులు అన్నాసాగర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు మద్యం సేవించారు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపిన ఆ యువకులు.. ఇంకా మద్యం తీసుకొస్తామని చెప్పి ఆయన బైక్ తీసుకెళ్లారు. బైక్ తాళం చెవిగుత్తికే ఇంటి తాళం చెవి ఉండటంతో.. నేరుగా ఆ టీచర్ ఇంటికి వెళ్లారు. బీరువా తాళాన్ని పగలగొట్టి.. రూ. 30 లక్షల నగదు, 10 తులాలా బంగారు తీసుకొని వెళ్లిపోయారు. మరోవైపు.. సాయంత్రం 5 గంటలకు వెళ్లిన యువకులు, రాత్రి 8 అయినా రాకపోయేసరికి లక్ష్మీనారాయణ తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయమే 5 గంటలకు తన ఇంటికి వెళ్లారు. తీరా ఇంటికి చేరుకున్నాక, ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామన్న ఉద్దేశంతో తాను డబ్బు దాచుకున్నానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం పరిచయమైన యువకులే ఈ పని చేశారన్నారు. తమది సంగారెడ్డి అని ఆ యువకులు చెప్పారని, కానీ పేర్లు మాత్రం వెల్లడించలేదన్నారు. రిటైర్డ్ టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..