Sonali Phogat Case: సోనాలి ఫోగట్ హత్య కేసులో నిందితులకు 10 రోజుల పోలీసు కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonali Phogat Case: నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్ప్రసాద్ గాంకర్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది. డ్రగ్స్ సరఫరా చేసిన డ్రగ్ పెడ్లర్తో పాటు రెస్టారెంట్ యజమానిని కూడా అరెస్ట్ చేసినట్లు డీజీపీ జస్పాల్ సింగ్ వెల్లడించారు. ఈ కేసుపై అనేక బృందాలు పని చేస్తున్నాయన్నారు. ఒక బృందాన్ని హర్యానాకు కూడా పంపుతామని ఆయన తెలిపారు.
సోనాలి ఫోగట్ కుటుంబం అనుమానాలను ధ్రువీకరించడానికి తాము ఒక బృందాన్ని హర్యానాకు పంపుతున్నామని డీజీపీ చెప్పారు. ఎందుకంటే ఆ సందేహాలు దర్యాప్తుపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ఈ కేసులో గోవా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, 1985 సెక్షన్ కింద డ్రగ్ పెడ్లర్, కర్లీస్ యజమానిపై గోవా పోలీసులు మరో ఎఫ్ఐఆర్ జోడించారు.
Also Read
- EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
మూడు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను టాయిలెట్లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటల పాటు ఉన్నారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ ఫోగాట్ సహాయకులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ వసీలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్భేటీ.. విషయం ఇదేనా..?
నిందితులు సోనాలీ ఫోగాట్కు క్లబ్లోలో సింథటిక్ డ్రగ్ ఇచ్చారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. సింథటిక్ డ్రగ్ అని చెప్పారు కానీ, ఆ పదార్థం పేరు ఏమిటన్నది వెల్లడించలేదని తెలిపారు. ఆ పదార్థాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ డ్రగ్ ఇచ్చిన అనంతరం ఆమెను టాయిలెట్లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటలపాటు ఉన్నారని.. అక్కడ ఏం జరిగిందో మాత్రం నిందితులు నోరు విప్పలేదన్నారు. అయితే ఆమెకు వారిచ్చిన డ్రగ్స్ కారణంగానే మరణించినట్లు తెలుస్తోందన్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం సోనాలీ ఫోగాట్ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెతో పాటు ఉన్న ఆ సహాయకులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తన టిక్టాక్ వీడియోలతో ఖ్యాతి గడించిన ఈ నటి, 2019 హర్యానా ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. ఆమె 2020లో బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా కనిపించింది.
తాజావార్తలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!