Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది.. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలంలోని అడపారెడ్డి పల్లిలో కేవలం 10 అంకణాల (80 గజాల) స్థలం వివాదం కారణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్థల వివాదం ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
పోలీసుల సమాచారం మేరకు, మృతుడు అమర్నాథ్ రెడ్డి (45)గా గుర్తించారు. ఎదురింటికి చెందిన రాహుల్ రెడ్డి అనే యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి కూతురు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో బిర్యానీ విందు ఏర్పాటు చేసి ఆనందంగా గడుపుతున్నారు. ఈ సమయంలో అమర్నాథ్ రెడ్డి రెండో అంతస్తులో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా రాహుల్ రెడ్డి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక, అమర్నాథ్ రెడ్డి తండ్రి నాథముని రెడ్డిని కూడా హత్య చేయడానికి నిందితుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులోనే రాహుల్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు నిందితుడి ఇల్లు, బైక్ను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
-
Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
-
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
-
Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్పై ఒత్తిడి పెంచే ప్లాన్..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!