Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది.. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలంలోని అడపారెడ్డి పల్లిలో కేవలం 10 అంకణాల (80 గజాల) స్థలం వివాదం కారణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్థల వివాదం ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
Also Read
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
- Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
పోలీసుల సమాచారం మేరకు, మృతుడు అమర్నాథ్ రెడ్డి (45)గా గుర్తించారు. ఎదురింటికి చెందిన రాహుల్ రెడ్డి అనే యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి కూతురు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో బిర్యానీ విందు ఏర్పాటు చేసి ఆనందంగా గడుపుతున్నారు. ఈ సమయంలో అమర్నాథ్ రెడ్డి రెండో అంతస్తులో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా రాహుల్ రెడ్డి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక, అమర్నాథ్ రెడ్డి తండ్రి నాథముని రెడ్డిని కూడా హత్య చేయడానికి నిందితుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులోనే రాహుల్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు నిందితుడి ఇల్లు, బైక్ను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..