Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs LSG- Virat Kohli: నిన్న (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ పోరులో ఆర్సీబీ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు సులభతరమైన విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 49 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తృటిలో ఓ రికార్డును మిస్ చేసుకున్నాడు. తన 66వ ఐపీఎల్ హాఫ్ సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో పెవిలియన్కు చేరుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి లాంగ్ ఆన్ వద్ద నికోలస్ పూరన్కు చిక్కాడు. కోహ్లీ అవుటైన సమయంలో స్టేడియంలో భార్య అనుష్క శర్మ తీవ్ర నిరాశకు గురైంది. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది.
READ MORE: MK Stalin: డీలిమిటేషన్పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
Also Read
- Nitish Rana Out: నితీష్ రాణా ఔట్పై వివాదం.. డెడ్ బాల్ ఇవ్వాలా?.. నిబంధనలు ఏమంటున్నాయి?
- IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
- Daniel Vettori: "పక్కా ప్లాన్తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
- Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆర్సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో లక్నోకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ (4/24) నాలుగు వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశాడు. కోహ్లీ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్ కీపర్ జితేష్ శర్మ (23) వేగంగా పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆర్సీబీ టోర్నీలో తన జోరును కొనసాగిస్తోంది.
READ MORE: Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
తాజావార్తలు
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
-
Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!