Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs LSG- Virat Kohli: నిన్న (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ పోరులో ఆర్సీబీ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు సులభతరమైన విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 49 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తృటిలో ఓ రికార్డును మిస్ చేసుకున్నాడు. తన 66వ ఐపీఎల్ హాఫ్ సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో పెవిలియన్కు చేరుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి లాంగ్ ఆన్ వద్ద నికోలస్ పూరన్కు చిక్కాడు. కోహ్లీ అవుటైన సమయంలో స్టేడియంలో భార్య అనుష్క శర్మ తీవ్ర నిరాశకు గురైంది. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది.
READ MORE: MK Stalin: డీలిమిటేషన్పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆర్సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో లక్నోకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ (4/24) నాలుగు వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశాడు. కోహ్లీ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్ కీపర్ జితేష్ శర్మ (23) వేగంగా పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆర్సీబీ టోర్నీలో తన జోరును కొనసాగిస్తోంది.
READ MORE: Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
తాజావార్తలు
-
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
-
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
-
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
-
US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
-
Astrology: ఎవరినైనా సులభంగా నమ్మే 4 రాశులు.. అందుకే ఎక్కువసార్లు మోసపోతారా?
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!