Video Call: 45, 55 ఏళ్ల మహిళల న్యూడ్ వీడియో కాల్ దందా.. పక్కా ప్లాన్ ప్రకారం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ విప్లవం పడగనీడలో సైబర్ నేరాలు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. కేవలం డబ్బులు కాజేయడమే కాకుండా.. నైతిక విలువలను పక్కనపెట్టి ఆన్లైన్ వేదికగా సాగుతున్న అశ్లీల దందా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పెద్ద నగరాల్లో కనిపించే ఇలాంటి వికృత ధోరణులు, ఇప్పుడు తెనాలి వంటి పట్టణాలకు సైతం పాకడం సమాజంలో మారుతున్న వికృత పోకడలకు నిదర్శనం. ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఇలాంటి అనైతిక పనులకు ప్రోత్సాహం అందించడం మరింత దిగ్భ్రాంతికరం.
తెనాలిలో గుట్టురట్టు..
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పాండురంగపేటలో ఒక ఇల్లు కేంద్రంగా సాగుతున్న అశ్లీల చాటింగ్ వ్యవహారాన్ని త్రీ టౌన్ పోలీసులు గురువారం రాత్రి రట్టు చేశారు. ఈ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 44 ఏళ్లు, 54 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో ‘న్యూడ్ చాటింగ్’ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
- Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
కీలక నిందితుడు సాయి..
ఈ మొత్తం వ్యవహారంలో ఒక మహిళ కుమారుడైన సాయి కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సాంకేతిక అంశాలను చక్కబెడుతూ.. కస్టమర్లను ఆకర్షించడం, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడంలో ఇతడు సహకరిస్తున్నాడు. పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, గత కొద్దిరోజులుగా రహస్యంగా విచారణ చేపట్టారు.
Also Read:SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
న్యాయపరమైన చర్యలు..
జిల్లాలో ఈ తరహా అంశంపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో లోతైన విశ్లేషణ కోసం వారు న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకున్నారు. చట్టపరంగా చూస్తే.. ఈ కేసులో పాల్గొన్న ఇద్దరు మహిళలను ‘బాధితులు’గా పరిగణించనున్నారు. అంటే వీరిని ప్రలోభపెట్టి లేదా ఇతర కారణాలతో ఈ రొంపిలోకి దింపినట్లు భావిస్తారు. కాగా.. ప్రధాన నిందితుడు సాయిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పరారీలో నిందితుడు..
ప్రస్తుతం నిందితుడు సాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడు పట్టుబడితే.. ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఈ పోర్టల్ను ఎలా నిర్వహిస్తున్నారు? దీని ద్వారా ఎంతమంది బాధితులు మోసపోయారు? అనే కోణంలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సైబర్ వేదికగా సాగే ఇలాంటి నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..